కువైట్లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- October 29, 2025
కువైట్: కువైట్ లో విదేశీయుల చెల్లింపుల్లో పెరుగుదల నమోదైంది. ఈ ఏడాది ప్రథమార్థంలో కువైట్ నుండి విదేశీయుల చెల్లింపులు 23.7% వృద్ధిని నమోదు చేశాయి. గత సంవత్సరం ఇదే కాలంలో KWD 2.053 బిలియన్ల కువైట్ దినార్లతో పోలిస్తే ఇది 2.541 బిలియన్ల కువైట్ దినార్లకు చేరుకుందని ఇటీవల విడుదల చేసిన అధికారిక చెల్లింపుల బ్యాలెన్స్ డేటా తెలిపింది.
గత సంవత్సరంతో పోలిస్తే ఈ రెమిటెన్స్ పెరుగుదల 487.5 మిలియన్ కువైట్ దినార్లకు పెరిగింది. ఈ పెరుగుదల కువైట్ లేబర్ మార్కెట్లో 4.1% విస్తరణతో సమానంగా నిలిచింది. 2025 మధ్య నాటికి ఈ సంఖ్య 2.2 మిలియన్లకు చేరుకుంది. దీని ద్వారా 88,400 మంది ఉద్యోగులు కొత్తగా పెరిగారు.
త్రైమాసిక డేటా ప్రకారం, మొదటి త్రైమాసికంలో 1.226 బిలియన్ కువైట్ దినార్లు ఉండగా, రెండవ త్రైమాసికంలో రెమిటెన్స్ 9.5% పెరిగి 1.342 బిలియన్ కువైట్ దినార్లుగా ఉంది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









