అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- October 29, 2025
యూఏఈ: అద్దెదారులకు షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గుడ్ న్యూస్ చెప్పింది. రియల్ ఎస్టేట్ లీజింగ్ మరియు దాని కార్యనిర్వాహక నిబంధనలను సవరణకు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం.. సెప్టెంబర్ 19, 2024కి ముందు గడువు ముగిసిన ఒప్పందాలను క్రమబద్ధీకరించుకోని అద్దెదారులకు విధించిన జరిమానాలను పూర్తిగా మినహాయించడంతో పాటు, ప్రామాణీకరణ రుసుములపై 50 శాతం మినహాయింపును ప్రకటించారు.
ఈ మినహాయింపులు నవంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటాయి. నివాస, వాణిజ్య, పారిశ్రామిక మరియు పెట్టుబడి ఒప్పందాలు సహా అన్ని రకాల లీజులకు ఇది వర్తిస్తుందని ప్రకటించారు.
దీనితోపాటు కౌన్సిల్ హసద్ సెంటర్ ప్రాజెక్ట్ను ఆమోదించింది. ఇది ఆహార భద్రతకు మద్దతు ఇవ్వడానికి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి మరియు షార్జాలోని రైతులకు సహాయం చేయడానికి రూపొందించబడిన ఒక ప్రాజెక్టు. ఈ కేంద్రం పండ్లు మరియు కూరగాయల సేకరణ కేంద్రంగా పనిచేస్తుంది. వాటి పంపిణీని సులభతరం చేస్తుంది. స్థానిక ఉత్పత్తిదారులకు మద్దతును అందిస్తుందని పేర్కొన్నారు.
షార్జా క్రౌన్ ప్రిన్స్ మరియు డిప్యూటీ పాలకుడు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ ఖాసిమి అధ్యక్షతన షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం జరిగింది.
తాజా వార్తలు
- మస్కట్లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







