మస్కట్లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- October 29, 2025
మస్కట్: మస్కట్లో ఇక ట్రాఫిక్ కష్టాలకు తెరపడనుంది. ట్రాఫిక్ సమస్యలు అధికంగా ఉండే ప్రాంతాల్లో కొత్తగా బ్రిడ్జిలు, టన్నెల్స్ ను నిర్మించనున్నారు. ఈ మేరకు ఒమన్ రవాణా, కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అల్ మౌజ్ రోడ్ మరియు 18వ నవంబర్ స్ట్రీట్ ప్రధాన అభివృద్ధికి అధికారికంగా కాంట్రాక్టుకు ఆమోదం తెలిపింది. ఈ కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ మస్కట్లోని అత్యంత రద్దీగా ఉండే కారిడార్లలో ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించడం మరియు కనెక్టివిటీని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది. అలాగే ఈ ప్రాంతంలో పెరిగిన వాణిజ్య, ఆర్థిక మరియు పర్యాటక కార్యకలాపాలకు ఈ ప్రాజెక్టు మద్దతుగా నిలుస్తుందని వెల్లడించారు.
ఈ ప్రాజెక్ట్లో భాగంగా 18వ నవంబర్ స్ట్రీట్ వెంబడి ప్రతి దిశలో మూడవ లేన్ను, ఇది విమానాశ్రయ వంతెన నుండి అల్ ఇష్రాక్ రౌండ్అబౌట్ వరకు (అల్ సీబ్ బీచ్ వైపు) విస్తరణ పనులు, కీలకమైన ఇంటర్ జంక్షన్ల అప్గ్రేడ్లు చేయనున్నారు. వీటితోపాటు ప్రస్తుతం ఉన్న అల్ మౌజ్ రౌండ్అబౌట్ కొత్త బ్రిడ్జి మరియు నాలుగు-మార్గాల ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ నిర్మాణం చేపట్టనున్నారు. అల్ బహ్జా రౌండ్అబౌట్ ఫ్లైఓవర్ మరియు వాహనాల కోసం అండర్పాస్ లను నిర్మిస్తారు.
తాజా వార్తలు
- మస్కట్లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







