'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- October 29, 2025
గుంటూరు: ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో శ్రీ సత్య సాయి స్పిరిచువల్ సిటీ, అమరావతి, గుంటూరు హైవేలో 2026 జనవరి 3, 4, 5 తేదీలలో నిర్వహించబడనున్న మూడవ ప్రపంచ తెలుగు మహా సభల సన్నాహాల్లో భాగంగా నిర్వహించిన "కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం" పోటీల విజేతలను పరిషత్తు ప్రకటించింది.
పోటీ విజేతలకు బహుమతుల ప్రదానం జనవరి 3న సాయంత్రం 5 గంటలకు ప్రపంచ తెలుగు మహా సభల ప్రధాన వేదికపై ఘనంగా నిర్వహించబడుతుంది. పోటీ సమన్వయకర్త కార్టూనిస్ట్ హరి తెలిపారు . ఎంపికైన ఉత్తమ కార్టూన్లను తెలుగు మహా సభల సందర్భంలో ఏర్పాటు చేయబోయే ప్రత్యేక కార్టూన్ ప్రదర్శనలో ప్రదర్శించనున్నారని డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు.
విజేతలు:
🥇 ప్రధమ బహుమతి –రామ్ శేషు, నెల్లూరు
🥈 ద్వితీయ బహుమతి –సునీల్, అమలాపురం
🥉 తృతీయ బహుమతి –సరసి, హైదరాబాద్
ప్రోత్సాహక బహుమతులు:
బొమ్మన్, విజయవాడ
పర్శి నాయుడు, మన్యం జిల్లా
కోరాడ రాంబాబు
ఈ సందర్భంగా డా.గజల్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఈ పోటీలు తెలుగు భాషా, సంస్కృతి, భావప్రకటనల అభివృద్ధికి కార్టూన్ కళాకారులు అందిస్తున్న సేవలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నంగా ఉన్నాయని అన్నారు. విజేతలుగా నిలిచిన కార్టూన్లను పత్రికలకు విడుదల చేసారు.



తాజా వార్తలు
- 32 ఉల్లంఘనలను జారీ చేసిన కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- అత్యవసర సంఘటన ప్రాంతాలకు దూరంగా ఉండండి..!!
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ









