'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- October 29, 2025
గుంటూరు: ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో శ్రీ సత్య సాయి స్పిరిచువల్ సిటీ, అమరావతి, గుంటూరు హైవేలో 2026 జనవరి 3, 4, 5 తేదీలలో నిర్వహించబడనున్న మూడవ ప్రపంచ తెలుగు మహా సభల సన్నాహాల్లో భాగంగా నిర్వహించిన "కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం" పోటీల విజేతలను పరిషత్తు ప్రకటించింది.
పోటీ విజేతలకు బహుమతుల ప్రదానం జనవరి 3న సాయంత్రం 5 గంటలకు ప్రపంచ తెలుగు మహా సభల ప్రధాన వేదికపై ఘనంగా నిర్వహించబడుతుంది. పోటీ సమన్వయకర్త కార్టూనిస్ట్ హరి తెలిపారు . ఎంపికైన ఉత్తమ కార్టూన్లను తెలుగు మహా సభల సందర్భంలో ఏర్పాటు చేయబోయే ప్రత్యేక కార్టూన్ ప్రదర్శనలో ప్రదర్శించనున్నారని డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు.
విజేతలు:
🥇 ప్రధమ బహుమతి –రామ్ శేషు, నెల్లూరు
🥈 ద్వితీయ బహుమతి –సునీల్, అమలాపురం
🥉 తృతీయ బహుమతి –సరసి, హైదరాబాద్
ప్రోత్సాహక బహుమతులు:
బొమ్మన్, విజయవాడ
పర్శి నాయుడు, మన్యం జిల్లా
కోరాడ రాంబాబు
ఈ సందర్భంగా డా.గజల్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఈ పోటీలు తెలుగు భాషా, సంస్కృతి, భావప్రకటనల అభివృద్ధికి కార్టూన్ కళాకారులు అందిస్తున్న సేవలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నంగా ఉన్నాయని అన్నారు. విజేతలుగా నిలిచిన కార్టూన్లను పత్రికలకు విడుదల చేసారు.



తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









