ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- October 29, 2025
యూఏఈ: ఫుజైరాలోని దిబ్బాలో విషాదం చోటుచేసుకుంది. రెండేళ్ల బాలుడు స్విమ్మింగ్ పూల్ లో నీట మునిగి చనిపోయాడు. మరణించిన బాలుడి కుటుంబం తమ ఫాంహౌజ్ లో విశ్రాంతి తీసుకునేందుకు వచ్చిన సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
ఇంటి పనిమనిషి బాత్రూమ్కి వెళ్లి వచ్చే లోగా బాలుడు కనిపించకుండా పోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు బాలుడి కోసం ఫాంహౌజ్ మొత్తం వెతికారు. స్విమ్మింగ్ పూల్ లో అచేతనంగా పడిఉన్న బాలుడికి గుర్తించి, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లామని, అప్పటికే బాబు చనిపోయాడని డాక్టర్లు తెలిపారని వెల్లడించారు. స్విమ్మింగ్ లేదా ఏదైనా ప్రమాదకర కార్యకలాపాల సమయంలో పిల్లలను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని తల్లిదండ్రులకు సూచించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









