ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- October 29, 2025
యూఏఈ: ఫుజైరాలోని దిబ్బాలో విషాదం చోటుచేసుకుంది. రెండేళ్ల బాలుడు స్విమ్మింగ్ పూల్ లో నీట మునిగి చనిపోయాడు. మరణించిన బాలుడి కుటుంబం తమ ఫాంహౌజ్ లో విశ్రాంతి తీసుకునేందుకు వచ్చిన సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
ఇంటి పనిమనిషి బాత్రూమ్కి వెళ్లి వచ్చే లోగా బాలుడు కనిపించకుండా పోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు బాలుడి కోసం ఫాంహౌజ్ మొత్తం వెతికారు. స్విమ్మింగ్ పూల్ లో అచేతనంగా పడిఉన్న బాలుడికి గుర్తించి, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లామని, అప్పటికే బాబు చనిపోయాడని డాక్టర్లు తెలిపారని వెల్లడించారు. స్విమ్మింగ్ లేదా ఏదైనా ప్రమాదకర కార్యకలాపాల సమయంలో పిల్లలను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని తల్లిదండ్రులకు సూచించారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









