తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్
- July 23, 2016
తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి సంబంధించిన ఎన్నికలు శుక్రవారం విజయవాడలో జరిగాయి. అధ్యక్ష పదవికి నిర్మాత పి. కిరణ్, సి. కల్యాణ్ పోటీ పడగా, కల్యాణ్ విజయం సాధించారు. కార్య నిర్వాహక సభ్యులు 45 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 19 ఓట్లు పి. కిరణ్కు, 26 ఓట్లు సి. కల్యాణ్కు దక్కాయి. ఎన్నికలు ముగిసిన అనంతరం చలన చిత్ర వాణిజ్య మండలిలో జరిగిన సత్కార కార్యక్రమంలో అధ్యక్షుడు సి. కల్యాణ్ని, నిర్మాతల మండలి సెక్టార్ చైర్మన్ సత్యారెడ్డిని పలువురు సినీరంగ ప్రముఖులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు దాసరి కిరణ్కుమార్, ముత్యాల రమేశ్, ముత్యాల రాందాస్, సురేందర్ రెడ్డి, పోతుల రవికిశోర్, నాగులపల్లి పద్మిని, నటుడు, నిర్మాత అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









