తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్
- July 23, 2016
తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి సంబంధించిన ఎన్నికలు శుక్రవారం విజయవాడలో జరిగాయి. అధ్యక్ష పదవికి నిర్మాత పి. కిరణ్, సి. కల్యాణ్ పోటీ పడగా, కల్యాణ్ విజయం సాధించారు. కార్య నిర్వాహక సభ్యులు 45 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 19 ఓట్లు పి. కిరణ్కు, 26 ఓట్లు సి. కల్యాణ్కు దక్కాయి. ఎన్నికలు ముగిసిన అనంతరం చలన చిత్ర వాణిజ్య మండలిలో జరిగిన సత్కార కార్యక్రమంలో అధ్యక్షుడు సి. కల్యాణ్ని, నిర్మాతల మండలి సెక్టార్ చైర్మన్ సత్యారెడ్డిని పలువురు సినీరంగ ప్రముఖులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు దాసరి కిరణ్కుమార్, ముత్యాల రమేశ్, ముత్యాల రాందాస్, సురేందర్ రెడ్డి, పోతుల రవికిశోర్, నాగులపల్లి పద్మిని, నటుడు, నిర్మాత అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







