యూఏఈలోని భారతీయ ప్రవాసులకు ఇక ఇ-పాస్పోర్టులే..!!
- October 31, 2025
యూఏఈ: పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే యూఏఈలోని ప్రవాసులు ఇకపై ఇ-పాస్పోర్ట్ను మాత్రమే పొందుతారు. ఈ మేరకు దుబాయ్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా (CGI) అధికారులు ధృవీకరించారు. ఈ-పాస్పోర్ట్ వ్యవస్థను భారత ప్రభుత్వం అక్టోబర్ 28న ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించింది.
ఈ-పాస్పోర్ట్ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్ మరియు పాస్పోర్ట్ హోల్డర్ వ్యక్తిగత వివరాలు, బయోమెట్రిక్ సమాచారాన్ని కలిగి ఉంటుంది. కొంతమంది నివాసితులకు కొత్త RFID-ఎంబెడెడ్ పాస్పోర్ట్లు ఇప్పటికే జారీ చేయబడిందని అధికారులు తెలిపారు.
కొత్త నిబంధనల ప్రకారం, దరఖాస్తుదారులు పాస్పోర్ట్ సేవా కార్యక్రమం (GPSP 2.0)లో కొత్త పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇది వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తుందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని భారత రాయబార కార్యాలయం ఛార్జ్ డి అఫైర్స్ ఎ. అమర్నాథ్ అన్నారు. ఎంబెడెడ్ చిప్ పాస్ పోర్టుకు మరింత భద్రతను అందిస్తుందని పేర్కొన్నారు. ఎవరైనా పాస్పోర్ట్ను నకిలీ చేయడానికి ప్రయత్నిస్తే.. వారిని ఇమ్మిగ్రేషన్ సిస్టమ్స్ సులువుగా గుర్తిస్తాయని తెలిపారు.
అయితే, ప్రస్తుతానికి, పాస్పోర్ట్ దరఖాస్తుల కోసం విదేశాలలో ఫిజికల్ బయోమెట్రిక్లను సేకరించే ప్రణాళికలు లేవని అధికారులు తెలిపారు. పాస్పోర్ట్ జారీ సమయం లేదా సేవా ఛార్జీలలో ఎటువంటి మార్పులు ఉండవని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







