మిడిల్ ఈస్ట్ శాంతికి పాలస్తీనా స్టేట్ అవసరం.. బహ్రెయిన్
- November 02, 2025
మనామా: మధ్యప్రాచ్య శాంతికి పాలస్తీనా స్టేట్ ఏర్పాటు అనేది అత్యవసరమని బహ్రెయిన్ స్పష్టం చేసింది. డిఫ్లొమసీ, ఎకానమీ, డిఫెన్స్ ద్వారా గల్ఫ్ ను సురక్షితంగా ఉంచడం ఎలా అనే థీమ్తో జరిగిన IISS మనామా డైలాగ్ 2025 రెండవ రోజు బహ్రెయిన్ ఫారిన్ మినిస్టర్ డాక్టర్ అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్జయానీ పాల్గొని ప్రసంగించారు.
గల్ఫ్ లో శాంతి మరియు భద్రత కోసం ప్రాంతీయ, అంతర్జాతీయ నాయకులు ఐక్యంగా కలిసి కట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గల్ఫ్ లో శాశ్వతంగా శాంతి నెలకొనడానికి పాలస్తీనా స్టేట్ ఏర్పాటు అనేది అత్యవసరమని స్పష్టం చేశారు. భద్రత, శాంతి అనేది ఏ ఒక్క దేశం కారణంగా సాధ్యం కాదని, ఇది ప్రపంచ దేశాల ఉమ్మడి బాధ్యత అని డాక్టర్ అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్జయానీ తేల్చి చెప్పారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







