ఖతార్ లో సైబర్ మోసాల పై హెచ్చరిక జారీ..!!
- November 02, 2025
దోహా: ఖతార్ లో ఇటీవల సైబర్ మోసాల సంఖ్య క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. తెలియని లేదా నమ్మదగని మూలాల నుండి వచ్చిన లింక్లను ఓపెన్ చేయొద్దని హెచ్చరించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్ట్ ను జారీ చేసింది.
ప్రజలు వారి పరికరాల భద్రత, వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవడానికి అధికారిక యాప్ స్టోర్ల నుండి అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా సైబర్ నేరాల బారీన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. మోసపూరితమైన లింకులు మీ డేటాను కాజేసే హానికరమైన సాఫ్ట్వేర్ను కలిగి ఉండవచ్చని హెచ్చరించింది. ఏదైనా మోసానికి గురైన వెంటనే పోలీసులను ఆశ్రయించాలని మంత్రిత్వశాఖ సూచించింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









