ఖతార్ లో సైబర్ మోసాల పై హెచ్చరిక జారీ..!!

- November 02, 2025 , by Maagulf
ఖతార్ లో సైబర్ మోసాల పై హెచ్చరిక జారీ..!!

దోహా: ఖతార్ లో ఇటీవల సైబర్ మోసాల సంఖ్య క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. తెలియని లేదా నమ్మదగని మూలాల నుండి వచ్చిన లింక్‌లను ఓపెన్ చేయొద్దని హెచ్చరించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్ట్ ను జారీ చేసింది.

ప్రజలు వారి పరికరాల భద్రత, వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవడానికి అధికారిక యాప్ స్టోర్‌ల నుండి అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా సైబర్ నేరాల బారీన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.   మోసపూరితమైన లింకులు  మీ డేటాను కాజేసే హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉండవచ్చని హెచ్చరించింది. ఏదైనా మోసానికి గురైన వెంటనే పోలీసులను ఆశ్రయించాలని మంత్రిత్వశాఖ సూచించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com