ఖతార్ లో సైబర్ మోసాల పై హెచ్చరిక జారీ..!!
- November 02, 2025
దోహా: ఖతార్ లో ఇటీవల సైబర్ మోసాల సంఖ్య క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. తెలియని లేదా నమ్మదగని మూలాల నుండి వచ్చిన లింక్లను ఓపెన్ చేయొద్దని హెచ్చరించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్ట్ ను జారీ చేసింది.
ప్రజలు వారి పరికరాల భద్రత, వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవడానికి అధికారిక యాప్ స్టోర్ల నుండి అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా సైబర్ నేరాల బారీన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. మోసపూరితమైన లింకులు మీ డేటాను కాజేసే హానికరమైన సాఫ్ట్వేర్ను కలిగి ఉండవచ్చని హెచ్చరించింది. ఏదైనా మోసానికి గురైన వెంటనే పోలీసులను ఆశ్రయించాలని మంత్రిత్వశాఖ సూచించింది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







