షార్జాలో ప్రొటెక్ట్ యానిమల్స్ బిజినెస్..వ్యక్తి అరెస్టు..!!
- November 03, 2025
యూఏఈ: రక్షిత యానిమల్స్ ను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని షార్జా అధికారులు అరెస్టు చేశారు. అంతరించిపోతున్న కొంగలు, నక్కలు వంటి రక్షిత జంతువులను విక్రయిస్తుండగా, దాడి చేసి పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
అనంతరం స్వాధీనం చేసుకున్న యానిమల్స్ ను షార్జా ఎన్విరాన్మెంట్ అండ్ నేచర్ రిజర్వ్స్ అథారిటీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ సమన్వయంతో వాటిని నేచర్ రిజర్వ్ లలో వదిలేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
రక్షిత జంతువుల వ్యాపారానికి సంబంధించిన ఏవైనా అనుమానాస్పద సమాచారాన్ని అందజేసి సహకరించాలని షార్జా పోలీసులు కోరారు. యూఏఈలో అమల్లో ఉన్న చట్టాల ప్రకారం, రిజిస్ట్రేషన్ లేకుండా ప్రమాదకరమైన జంతువును కలిగి ఉంటే Dh10,000 నుండి ప్రారంభమై Dh500,000 వరకు జరిమానా విధిస్తారు.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







