బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
- November 04, 2025
మనామా: బహ్రెయిన్-భారత్ సంయుక్త మంత్రివర్గ కమిటీ ఐదవ సెషన్ భారత రాజధాని న్యూఢిల్లీలో ప్రారంభం అయ్యాయి. బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ మరియు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగాడిసెంబర్లో జరగనున్న గల్ఫ్ సమ్మిట్కు బహ్రెయిన్ అధ్యక్షత వహించడాన్ని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం ప్రశంసించారు. పలు రంగాలలో ఇరు దేశాలు సాధించిన స్పష్టమైన పురోగతిని సాధించాయని తెలిపారు. బహ్రెయిన్లోని భారతీయ కమ్యూనిటికి అందిస్తున్న మద్దతు మరియు సంరక్షణకు భారత్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
దిల్మున్ మరియు సింధు లోయ పురాతన నాగరికతల మధ్య దాదాపు ఐదు వేల సంవత్సరాల సాంస్కృతిక మార్పిడి మరియు వాణిజ్యంలో సంబంధాలు ఉన్నాయని బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అల్ జయానీ గుర్తుచేశారు. బహ్రెయిన్ -భారత్ మధ్య ఆర్థిక సంబంధాలు ద్వైపాక్షిక సంబంధానికి మూలస్తంభంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఆర్థిక, వాణిజ్యం, పెట్టుబడి మరియు అభివృద్ధి రంగాలలో సహకారాన్ని విస్తరించడానికి మార్గాలను ఈ సందర్భంగా సమీక్షించారు. అదే సమయంలో భద్రత, ఆరోగ్యం, సంస్కృతి, విద్య, పర్యాటకం, అంతరిక్ష శాస్త్రాలు మరియు రెండు దేశాల ప్రయోజనాలకు ఉపయోగపడే ఇతర కీలక రంగాలలో సహకారంపై కూడా చర్చించారు.
తాజా వార్తలు
- AI పరిశోధనలకు బిట్స్ పిలానీ–ఐఏఐఆర్వో భాగస్వామ్యం..
- అమెరికాలో జూలైలో 23 వేల ఉద్యోగాల కోత..
- 'AI'తో కొత్త ఉద్యోగాలు !!
- సౌదీ–టర్కీ–పాకిస్థాన్ మధ్య 'మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం'..
- జీఎస్టీ ఆదాయం పెంపునకు ఏఐ వినియోగం..కొత్త కార్యాచరణపై సీఎం రేవంత్ సమీక్ష
- ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ భగ్నం..
- ఫార్వర్డ్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి.. ప్రజలకు కీలక సూచనలు జారీ చేసిన TDRA
- గుడివాడ–శివమొగ్గ ప్రత్యేక రైలుకు గ్రీన్ సిగ్నల్ దిశగా ముందడుగు.. ఎంపీ బాలశౌరి కృషికి ఫలితం
- యూఏఈలో భారతీయులకు పాస్పోర్ట్, కాన్సులర్ సేవలను మరింత వేగవంతం
- యూఏఈ–రష్యా అధ్యక్షుల ఫోన్ సంభాషణ.. ద్వైపాక్షిక సహకారం, మిడిల్ ఈస్ట్ పరిణామాలపై చర్చ







