థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- November 05, 2025
న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా సినిమా థియేటర్ల లో టికెట్ ధరలతో పాటు తినుబండారాల రేట్లు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ పరిస్థితిపై సుప్రీంకోర్టు కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. సినిమా చూసే సామాన్య ప్రేక్షకుడి పై భారం రోజురోజుకీ పెరుగుతోందని, టికెట్తో పాటు పాప్కార్న్, కూల్ డ్రింక్స్ వంటి ఫుడ్ ఐటమ్స్ ధరలు సాధారణ ప్రజలకు అందనంతగా మారిపోయాయని కోర్టు వ్యాఖ్యానించింది.
ఇటీవల కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను రూ.200కు పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన మల్టీప్లెక్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
“ఇప్పటికే సినిమాకి వెళ్ళాలంటే కనీసం ₹1,500 నుంచి ₹2,000 వరకు ఖర్చవుతోంది. ఒక కుటుంబం సినిమా చూడాలంటే అది భారంగా మారింది. థియేటర్లలో ఫుడ్ ధరలు పెరిగిపోతున్నాయి. ఇది కొనసాగితే సినిమా హాళ్లు త్వరలోనే ఖాళీగా మారే ప్రమాదం ఉంది” అని ఆందోళన వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









