థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- November 05, 2025
న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా సినిమా థియేటర్ల లో టికెట్ ధరలతో పాటు తినుబండారాల రేట్లు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ పరిస్థితిపై సుప్రీంకోర్టు కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. సినిమా చూసే సామాన్య ప్రేక్షకుడి పై భారం రోజురోజుకీ పెరుగుతోందని, టికెట్తో పాటు పాప్కార్న్, కూల్ డ్రింక్స్ వంటి ఫుడ్ ఐటమ్స్ ధరలు సాధారణ ప్రజలకు అందనంతగా మారిపోయాయని కోర్టు వ్యాఖ్యానించింది.
ఇటీవల కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను రూ.200కు పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన మల్టీప్లెక్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
“ఇప్పటికే సినిమాకి వెళ్ళాలంటే కనీసం ₹1,500 నుంచి ₹2,000 వరకు ఖర్చవుతోంది. ఒక కుటుంబం సినిమా చూడాలంటే అది భారంగా మారింది. థియేటర్లలో ఫుడ్ ధరలు పెరిగిపోతున్నాయి. ఇది కొనసాగితే సినిమా హాళ్లు త్వరలోనే ఖాళీగా మారే ప్రమాదం ఉంది” అని ఆందోళన వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







