కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- November 05, 2025
కువైట్: కువైట్ లో అత్యంత జనసాంద్రత కలిగిన జిల్లాల్లో ఒకటైన జ్లీబ్ అల్-షుయౌఖ్ ప్రాంతంలోని 67 భవనాల కూల్చివేతకు కువైట్ మునిసిపాలిటీ నోటీసులు జారీ చేసింది. ఇందుకు రెండు వారాల గడువు ఇచ్చింది. భవనాలు సురక్షితంగా లేవని మరియు ప్రజా భద్రతకు ప్రత్యక్ష ముప్పు కలిగిస్తున్నాయని టెక్నికల్ కమిటీ తనిఖీలు నిర్ధారించాయని నోటీసుల్లో పేర్కొన్నారు.
కాగా, ప్రభావిత భవనాలు కూలిపోయే ప్రమాదం ఉందని, ఈ కట్టడాలు అందులో ఉంటున్న వారి ప్రాణాలతోపాటు చుట్టుపక్కల ఉంటున్న వారికి ముప్పు కలిగిస్తాయని కువైట్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్, ఇంజినీర్ మనల్ అల్-అస్ఫోర్ వెల్లడించారు. ఇక నోటీసులను పట్టించుకోని సందర్భంలో, భవనాలను పూర్తిగా ఖాళీ యజమాని ఖర్చుతో మునిసిపాలిటీ కూల్చివేత పనులను చేపడుతుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







