కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- November 05, 2025
కువైట్: కువైట్ లో అత్యంత జనసాంద్రత కలిగిన జిల్లాల్లో ఒకటైన జ్లీబ్ అల్-షుయౌఖ్ ప్రాంతంలోని 67 భవనాల కూల్చివేతకు కువైట్ మునిసిపాలిటీ నోటీసులు జారీ చేసింది. ఇందుకు రెండు వారాల గడువు ఇచ్చింది. భవనాలు సురక్షితంగా లేవని మరియు ప్రజా భద్రతకు ప్రత్యక్ష ముప్పు కలిగిస్తున్నాయని టెక్నికల్ కమిటీ తనిఖీలు నిర్ధారించాయని నోటీసుల్లో పేర్కొన్నారు.
కాగా, ప్రభావిత భవనాలు కూలిపోయే ప్రమాదం ఉందని, ఈ కట్టడాలు అందులో ఉంటున్న వారి ప్రాణాలతోపాటు చుట్టుపక్కల ఉంటున్న వారికి ముప్పు కలిగిస్తాయని కువైట్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్, ఇంజినీర్ మనల్ అల్-అస్ఫోర్ వెల్లడించారు. ఇక నోటీసులను పట్టించుకోని సందర్భంలో, భవనాలను పూర్తిగా ఖాళీ యజమాని ఖర్చుతో మునిసిపాలిటీ కూల్చివేత పనులను చేపడుతుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









