కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- November 05, 2025
కువైట్: కువైట్ లో అత్యంత జనసాంద్రత కలిగిన జిల్లాల్లో ఒకటైన జ్లీబ్ అల్-షుయౌఖ్ ప్రాంతంలోని 67 భవనాల కూల్చివేతకు కువైట్ మునిసిపాలిటీ నోటీసులు జారీ చేసింది. ఇందుకు రెండు వారాల గడువు ఇచ్చింది. భవనాలు సురక్షితంగా లేవని మరియు ప్రజా భద్రతకు ప్రత్యక్ష ముప్పు కలిగిస్తున్నాయని టెక్నికల్ కమిటీ తనిఖీలు నిర్ధారించాయని నోటీసుల్లో పేర్కొన్నారు.
కాగా, ప్రభావిత భవనాలు కూలిపోయే ప్రమాదం ఉందని, ఈ కట్టడాలు అందులో ఉంటున్న వారి ప్రాణాలతోపాటు చుట్టుపక్కల ఉంటున్న వారికి ముప్పు కలిగిస్తాయని కువైట్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్, ఇంజినీర్ మనల్ అల్-అస్ఫోర్ వెల్లడించారు. ఇక నోటీసులను పట్టించుకోని సందర్భంలో, భవనాలను పూర్తిగా ఖాళీ యజమాని ఖర్చుతో మునిసిపాలిటీ కూల్చివేత పనులను చేపడుతుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









