బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్‌..!!

- November 06, 2025 , by Maagulf
బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్‌..!!

మనామా: కేరళ ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవహారాల ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ రాజు నారాయణస్వామి బహ్రెయిన్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గురువారం స్టూడెంట్స్ గైడెన్స్ ఫోరం మరియు ఎడ్యుపార్క్ ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆరోజు రాత్రి 8:00 గంటలకు జింజ్‌లోని ఎడ్యుపార్క్ ఇన్‌స్టిట్యూట్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది.

ప్రముఖ వ్యాపారవేత్త మరియు సామాజిక కార్యకర్త కె.జి. బాబురాజ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు, స్టూడెంట్స్ గైడెన్స్ ఫోరం చైర్మన్ అబ్రహం జాన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. డాక్టర్ నారాయణస్వామి పర్యటనతో పాటు, స్టూడెంట్స్ గైడెన్స్ ఫోరం మరియు ఎడ్యుపార్క్ నవంబర్ 7 మరియు 8 తేదీల్లో జింజ్‌లోని ఎడ్యుపార్క్ కాంప్లెక్స్‌లో మినీ మ్యాథ్ ఒలింపియాడ్‌ను కూడా నిర్వహిస్తాయి. వివిధ పాఠశాలల నుండి దాదాపు 50 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పాల్గొనే వారందరికీ సర్టిఫికెట్లు అదజేస్తారు. ఈ మేరకు వివరాలను స్టూడెంట్స్ గైడెన్స్ ఫోరం చైర్మన్ అబ్రహం జాన్ వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com