మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- November 06, 2025
న్యూ ఢిల్లీ: మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్లో గెలిచి భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆ జట్టు కలిసింది. ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ కూడా మోదీని కలిసిన వారిలో ఉన్నారు. జట్టును మోదీ అభినందించారు.
ప్రపంచ కప్లో మూడు మ్యాచ్ల్లో ఓడిపోయినప్పటికీ అనంతరం టీమిండియా ధాటిగా ఆడిన తీరును గుర్తుచేసుకుని మరీ మోదీ ప్రశంసించారు. మహిళా ప్లేయర్లతో మోదీ మాట్లాడారు. భారతదేశంలో క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదని, అది ప్రజల జీవితంలో భాగమైందని చెప్పారు.
ఇందుకు సంబంధించిన వీడియోను ఇవాళ మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. కాగా, ఫైనల్లో దక్షిణాఫ్రికాను భారత్ 52 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. 52 ఏళ్ల ఈ టోర్నమెంట్ చరిత్రలో భారత్ తొలిసారి టైటిల్ గెలుచుకుంది.
ప్రపంచకప్ గెలిచిన జట్లు
1973–ఇంగ్లాండ్
1977/78–ఆస్ట్రేలియా
1981/82–ఆస్ట్రేలియా
1988/89–ఆస్ట్రేలియా
1993–ఇంగ్లాండ్
1997/98–ఆస్ట్రేలియా
2000/01–న్యూజిలాండ్
2004/05–ఆస్ట్రేలియా
2008/09–ఇంగ్లాండ్
2012/13–ఆస్ట్రేలియా
2017–ఇంగ్లాండ్
2021/22–ఆస్ట్రేలియా
2025/26–భారత్
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









