మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- November 06, 2025
న్యూ ఢిల్లీ: మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్లో గెలిచి భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆ జట్టు కలిసింది. ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ కూడా మోదీని కలిసిన వారిలో ఉన్నారు. జట్టును మోదీ అభినందించారు.
ప్రపంచ కప్లో మూడు మ్యాచ్ల్లో ఓడిపోయినప్పటికీ అనంతరం టీమిండియా ధాటిగా ఆడిన తీరును గుర్తుచేసుకుని మరీ మోదీ ప్రశంసించారు. మహిళా ప్లేయర్లతో మోదీ మాట్లాడారు. భారతదేశంలో క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదని, అది ప్రజల జీవితంలో భాగమైందని చెప్పారు.
ఇందుకు సంబంధించిన వీడియోను ఇవాళ మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. కాగా, ఫైనల్లో దక్షిణాఫ్రికాను భారత్ 52 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. 52 ఏళ్ల ఈ టోర్నమెంట్ చరిత్రలో భారత్ తొలిసారి టైటిల్ గెలుచుకుంది.
ప్రపంచకప్ గెలిచిన జట్లు
1973–ఇంగ్లాండ్
1977/78–ఆస్ట్రేలియా
1981/82–ఆస్ట్రేలియా
1988/89–ఆస్ట్రేలియా
1993–ఇంగ్లాండ్
1997/98–ఆస్ట్రేలియా
2000/01–న్యూజిలాండ్
2004/05–ఆస్ట్రేలియా
2008/09–ఇంగ్లాండ్
2012/13–ఆస్ట్రేలియా
2017–ఇంగ్లాండ్
2021/22–ఆస్ట్రేలియా
2025/26–భారత్
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









