జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- November 07, 2025
మనామాః గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC)లో బహ్రెయిన్, ఖతార్ తొలి అంతర్జాతీయ ప్రయాణీకుల సముద్ర మార్గాన్ని అధికారికంగా ప్రారంభించారు. బహ్రెయిన్లోని ముహర్రక్లోని సాదా పోర్టు నుండి ఖతార్లోని అల్ రువైస్ పోర్టుకు ప్రారంభ యాత్ర కొనసాగింది. ఇది గల్ఫ్ సముద్ర అనుసంధానం మరియు సహకారాన్ని బలోపేతం చేయడంలో గణనీయమైన ముందడుగుగా భావిస్తున్నారు.
బహ్రెయిన్-ఖతార్ ప్రయాణీకుల ఫెర్రీ సర్వీస్ ను బహ్రెయిన్ రవాణా మరియు టెలికమ్యూనికేషన్ల మంత్రి డాక్టర్ షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా ప్రారంభించారు. రవాణా నెట్వర్క్లను విస్తరించడం, ఉమ్మడి గల్ఫ్ సహకారాన్ని పెంపొందించడంలో బహ్రెయిన్ నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుందని ఆయన వెల్లడించారు.
బహ్రెయిన్ సముద్ర పర్యాటక రంగంలో ఇది కీలక ప్రాజెక్టుగా పేర్కొన్నారు. జాతీయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందజేస్తుందన్నారు. సముద్ర రవాణా రంగంలో బహ్రెయిన్ ప్రాంతీయ స్థానాన్ని బలోపేతం చేస్తుందని అన్నారు. ఈ ఉమ్మడి ప్రాజెక్టును సాకారం చేయడంలో సహకారం అందించిన వారిపై డాక్టర్ షేక్ అబ్దుల్లా షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ థానీ ప్రశంసలు కురిపించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







