కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- November 07, 2025
కువైట్ః కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన రెండు రోజుల అధికారిక కువైట్ పర్యటన ప్రారంభమైంది. బయాన్ ప్యాలెస్లో కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు హోంమంత్రి షేక్ ఫహద్ యూసఫ్ సౌద్ అల్ సబాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేరళ మరియు కువైట్ మధ్య కీలక రంగాలలో సహకారాన్ని పెంపొందించడంపై చర్చించారు. ఇండియా, కువైట్ మధ్య దీర్ఘకాలిక మరియు స్నేహపూర్వక సంబంధాలను సమీక్షించారు.
కువైట్ అభివృద్ధికి ఇండియాన్ కమ్యూనిటీ- ముఖ్యంగా మలయాళీల అమూల్యమైన సహకారాన్ని షేక్ ఫహద్ ప్రశంసించారు. కేరళీయుల పట్ల కువైట్ చూపుతున్న ప్రేమకు ముఖ్యమంత్రి విజయన్ కృతజ్ఞతలు తెలిపారు. కేరళను పెట్టుబడికి అనుకూలమైన గమ్యస్థానంగా హైలెట్ చేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయతిలక్, లులు గ్రూప్ చైర్మన్ M.A. యూసుఫ్ అలీ మరియు భారత రాయబార కార్యాలయం నుండి సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







