కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- November 07, 2025
కువైట్ః కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన రెండు రోజుల అధికారిక కువైట్ పర్యటన ప్రారంభమైంది. బయాన్ ప్యాలెస్లో కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు హోంమంత్రి షేక్ ఫహద్ యూసఫ్ సౌద్ అల్ సబాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేరళ మరియు కువైట్ మధ్య కీలక రంగాలలో సహకారాన్ని పెంపొందించడంపై చర్చించారు. ఇండియా, కువైట్ మధ్య దీర్ఘకాలిక మరియు స్నేహపూర్వక సంబంధాలను సమీక్షించారు.
కువైట్ అభివృద్ధికి ఇండియాన్ కమ్యూనిటీ- ముఖ్యంగా మలయాళీల అమూల్యమైన సహకారాన్ని షేక్ ఫహద్ ప్రశంసించారు. కేరళీయుల పట్ల కువైట్ చూపుతున్న ప్రేమకు ముఖ్యమంత్రి విజయన్ కృతజ్ఞతలు తెలిపారు. కేరళను పెట్టుబడికి అనుకూలమైన గమ్యస్థానంగా హైలెట్ చేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయతిలక్, లులు గ్రూప్ చైర్మన్ M.A. యూసుఫ్ అలీ మరియు భారత రాయబార కార్యాలయం నుండి సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







