Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- November 07, 2025
యూఏఈః యూఏఈ లాటరీలో Dh100 మిలియన్ల విజేతగా నిలిచిన అబుదాబి నివాసి, 9 ఏళ్ల ఈ భారతీయ ఐటీ ప్రొఫెషనల్ అనిల్కుమార్ బొల్లా తన భవిష్యత్ ప్లాన్ ను వెల్లడించాడు. వచ్చే దశాబ్దం పాటు యూఏఈని తన ఇంటిగా మార్చుకోవాలని యోచిస్తున్నాడట. ఇండియాలోని తెలంగాణకు చెందిన అనిల్కుమార్ దాదాపు ఏడాదిన్నర క్రితం అబుదాబికి వచ్చారు. అప్పటి నుండి IT రంగంలో పనిచేస్తున్నారు. త్వరలోనే తన కుటుంబాన్నియూఏఈ తీసుకురానున్నట్లు తెలిపాడు.వారంతా యూఏఈలో తనతోపాటే ఉండేలా ప్దెద ఇళ్లు కొనేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించాడు.
అక్టోబర్ 18న ఇంట్లో ఉండగా లాటరీ టీమ్ నుండి ఊహించని కాల్ వచ్చిందని, అది తన జీవితాన్ని మార్చేసిందని పేర్కొన్నాడు. యూఏఈ చరిత్రలో అతిపెద్ద Dh100 మిలియన్ల జాక్పాట్ గెలిచానని ప్రకటించగానే షాక్ కు గురైనట్లు తెలిపాడు.
లాటరీలో వచ్చిన మొత్తాన్ని పెట్టుబడి పెట్టే ముందు అతను ప్రొఫెషనల్ ఆర్థిక సలహా తీసుకోవాలని యోచిస్తున్నట్టు తెలిపాడు. రియల్ ఎస్టేట్లో మరియు స్టాక్ మార్కెట్లో కూడా పెట్టుబడి పెట్టాలని ప్లాన్స్ ఉన్నాయని పేర్కొన్నాడు. అలాగే, తన సహోద్యోగితో కలిసి IT కన్సల్టెన్సీ వ్యాపారాన్ని ప్రారంభించడం గురించి కూడా ఆలోచిస్తున్నట్లు వివరించాడు. తనకు సూపర్కార్ కొనాలనే కల ఉందని, ఖచ్చితంగా కొంటానని తెలిపాడు. అదే విధంగా తాను గెలిచిన డబ్బులో కొంత భాగాన్ని దాతృత్వానికి విరాళంగా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు అనిల్కుమార్ తెలిపారు.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







