ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- November 08, 2025
దోహా: ఎయిడ్స్, క్షయ మరియు మలేరియాపై పోరాడటానికి కలిసి రావాలని గ్లోబల్ ఫండ్ చైర్పర్సన్ రోస్లిన్ మొరాటా పిలుపునిచ్చారు. అంటు వ్యాధులను ఎదుర్కోవడానికి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నంలో ఖతార్ విలువైన భాగస్వామిగా ఉందని ప్రశంసించారు. ప్రపంచ ఆరోగ్య ఫైనాన్సింగ్లో ఖతార్ ప్రాముఖ్యత పెరుగుతుందని కొనియాడారు.
దోహాలో జరిగిన రెండవ ప్రపంచ సామాజిక అభివృద్ధి సదస్సులో పాల్గొని ప్రసంగించారు. గ్లోబల్ ఫండ్ను అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆరోగ్య ఫలితాలను సాధించడానికి ప్రభుత్వాలు, ప్రైవేట్ ఫౌండేషన్లు మరియు పౌర సమాజాన్ని ఏకం చేసే "ప్రత్యేక భాగస్వామ్యం"గా మొరాటా అభివర్ణించారు.
2002లో స్థాపించబడినప్పటి నుండి మధ్య-ఆదాయ దేశాలలో $70 బిలియన్లకు పైగా ఖర్చు చేసినట్టు తెలిపారు. 70 మిలియన్లకు పైగా ప్రాణాలను కాపాడిందని పేర్కొన్నారు. మూడు ప్రధాన వ్యాధుల మరణాలను 63 శాతం తగ్గించిందని వివరించారు. 2016లో ఖతార్ దాతగా చేరిందని, అప్పటి నుండి దాని విరాళాలను క్రమంగా పెంచిందని మొరౌటా వెల్లడించారు.
2030 నాటికి ఎయిడ్స్, క్షయ మరియు మలేరియాను నిర్మూలించే దిశగా పురోగతిని కొనసాగించడానికి $18 బిలియన్లను సేకరించాలని ప్రయత్నిస్తోందని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







