ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- November 08, 2025
దోహా: ఎయిడ్స్, క్షయ మరియు మలేరియాపై పోరాడటానికి కలిసి రావాలని గ్లోబల్ ఫండ్ చైర్పర్సన్ రోస్లిన్ మొరాటా పిలుపునిచ్చారు. అంటు వ్యాధులను ఎదుర్కోవడానికి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నంలో ఖతార్ విలువైన భాగస్వామిగా ఉందని ప్రశంసించారు. ప్రపంచ ఆరోగ్య ఫైనాన్సింగ్లో ఖతార్ ప్రాముఖ్యత పెరుగుతుందని కొనియాడారు.
దోహాలో జరిగిన రెండవ ప్రపంచ సామాజిక అభివృద్ధి సదస్సులో పాల్గొని ప్రసంగించారు. గ్లోబల్ ఫండ్ను అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆరోగ్య ఫలితాలను సాధించడానికి ప్రభుత్వాలు, ప్రైవేట్ ఫౌండేషన్లు మరియు పౌర సమాజాన్ని ఏకం చేసే "ప్రత్యేక భాగస్వామ్యం"గా మొరాటా అభివర్ణించారు.
2002లో స్థాపించబడినప్పటి నుండి మధ్య-ఆదాయ దేశాలలో $70 బిలియన్లకు పైగా ఖర్చు చేసినట్టు తెలిపారు. 70 మిలియన్లకు పైగా ప్రాణాలను కాపాడిందని పేర్కొన్నారు. మూడు ప్రధాన వ్యాధుల మరణాలను 63 శాతం తగ్గించిందని వివరించారు. 2016లో ఖతార్ దాతగా చేరిందని, అప్పటి నుండి దాని విరాళాలను క్రమంగా పెంచిందని మొరౌటా వెల్లడించారు.
2030 నాటికి ఎయిడ్స్, క్షయ మరియు మలేరియాను నిర్మూలించే దిశగా పురోగతిని కొనసాగించడానికి $18 బిలియన్లను సేకరించాలని ప్రయత్నిస్తోందని తెలిపారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







