ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- November 08, 2025
యూఏఈ: ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్ అమల్లోకి వచ్చాయి. యూఏఈలోని వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులకు మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) వ్యవస్థలకు యూజర్ యాక్సెస్ ఇచ్చే ముందు ముందస్తుగా వారిని పరీక్షించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
ఈ వ్యాపార కేంద్రాలు మంత్రిత్వ శాఖ సేవలను పొందాలనుకునే సంస్థలు మరియు వ్యక్తులకు మద్దతు అందించే ప్రైవేట్ రంగ సంస్థలను రిఫర్ చేస్తాయని పేర్కొంది.
ఈ కేంద్రాలు కస్టమర్ డేటా గోప్యతను కాపాడాలని, ఉల్లంఘనలకు పాల్పడినట్లు నిరూపితమైతే చట్టపరమైన ఆంక్షలు మరియు జరిమానాలు విధించనున్నట్లు తెలిపింది.
మోహ్రేకు తప్పుడు డేటా, డాక్యుమెంట్స్ లేదా సమాచారాన్ని అందించడం నేరంగా పరిగణించనున్నారు. వ్యాపార కేంద్ర ఉద్యోగులు మంత్రిత్వ శాఖ వ్యవస్థలను యాక్సెస్ చేయడానికి వారికి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అలాగే కేసులు నమోదు చేస్తారని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







