గడిచిన 24 గంటల్లో తెలుగురాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు..
- July 24, 2016
ఒడిషా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో తెలుగురాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి.పెద్దాపురంలో 10 సెంటీమీటర్లు, చోడవరంలో 9 సెం.మీ, చింతలపుడి, తాడేపల్లి గూడెంలలో 7 సెం.మీ, విజయనగరం, బాపట్లతో 6 సెం.మీ, నర్సీపట్నం, పోలవరంలలో 5 సెం.మీ, ఎమ్మిగనూరు, మదనపల్లిలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలో కొల్లాపూర్, అశ్వరావుపేటలలో 4 సెంటీమీటర్లు, చిన్నారావుపేటలో 3 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









