ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- November 13, 2025
మస్కట్: లిథియం బ్యాటరీలు, పవర్ బ్యాంకులు, స్మార్ట్ బ్యాగులు మరియు ఇ-సిగరెట్లు తీసుకెళ్లే ప్రయాణీకుల కోసం ఒమన్ ఎయిర్ కొత్త గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. ఇకపై పవర్ బ్యాంకులను హ్యాండ్ లగేజీలో మాత్రమే తీసుకెళ్లాలి. వాటిని ఫ్లైట్ లో ఉపయోగించకూడదు లేదా ఛార్జ్ చేయకూడదు. దెబ్బతిన్న లేదా లేబుల్ చేయని పవర్ బ్యాంకులపై నిషేధం విధించారు.
ఇ-సిగరెట్లు మరియు వేప్లను హ్యాండ్ లగేజీలో మాత్రమే అనుమతిస్తారు. వాటిని కూడా ఫ్లైట్ ఉపయోగించేందుకు అనుమతించరు. అయితే, ప్రయాణీకులు విమానంలోని ఛార్జింగ్ పోర్టులను ఉపయోగించి ఫోన్లు మరియు టాబ్లెట్లు వంటి వారి వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాలను (PEDలు) ఛార్జ్ చేసుకోవచ్చు. విమాన ప్రయాణంలో బ్యాటరీలు, పవర్ బ్యాంకులు మరియు ఇ-సిగరెట్లను ఛార్జ్ చేయకూడదు.
లిథియం బ్యాటరీతో నడిచే వ్యక్తిగత రవాణా పరికరాలు అయిన హోవర్బోర్డులు, బ్యాలెన్స్ వీల్స్, మినీ-స్కూటర్లు వంటి వస్తువులను చెక్డ్ లేదా క్యారీ-ఆన్ లగేజీగా విమానంలో అనుమతించరని ఎయిర్లైన్ తెలియజేసింది. ప్రయాణీకులకు అత్యున్నత భద్రతను అందించేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో ఇది భాగమని ఒమన్ ఎయిర్ తెలిపింది.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









