ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- November 13, 2025
మస్కట్: లిథియం బ్యాటరీలు, పవర్ బ్యాంకులు, స్మార్ట్ బ్యాగులు మరియు ఇ-సిగరెట్లు తీసుకెళ్లే ప్రయాణీకుల కోసం ఒమన్ ఎయిర్ కొత్త గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. ఇకపై పవర్ బ్యాంకులను హ్యాండ్ లగేజీలో మాత్రమే తీసుకెళ్లాలి. వాటిని ఫ్లైట్ లో ఉపయోగించకూడదు లేదా ఛార్జ్ చేయకూడదు. దెబ్బతిన్న లేదా లేబుల్ చేయని పవర్ బ్యాంకులపై నిషేధం విధించారు.
ఇ-సిగరెట్లు మరియు వేప్లను హ్యాండ్ లగేజీలో మాత్రమే అనుమతిస్తారు. వాటిని కూడా ఫ్లైట్ ఉపయోగించేందుకు అనుమతించరు. అయితే, ప్రయాణీకులు విమానంలోని ఛార్జింగ్ పోర్టులను ఉపయోగించి ఫోన్లు మరియు టాబ్లెట్లు వంటి వారి వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాలను (PEDలు) ఛార్జ్ చేసుకోవచ్చు. విమాన ప్రయాణంలో బ్యాటరీలు, పవర్ బ్యాంకులు మరియు ఇ-సిగరెట్లను ఛార్జ్ చేయకూడదు.
లిథియం బ్యాటరీతో నడిచే వ్యక్తిగత రవాణా పరికరాలు అయిన హోవర్బోర్డులు, బ్యాలెన్స్ వీల్స్, మినీ-స్కూటర్లు వంటి వస్తువులను చెక్డ్ లేదా క్యారీ-ఆన్ లగేజీగా విమానంలో అనుమతించరని ఎయిర్లైన్ తెలియజేసింది. ప్రయాణీకులకు అత్యున్నత భద్రతను అందించేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో ఇది భాగమని ఒమన్ ఎయిర్ తెలిపింది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







