ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- November 13, 2025
మస్కట్: లిథియం బ్యాటరీలు, పవర్ బ్యాంకులు, స్మార్ట్ బ్యాగులు మరియు ఇ-సిగరెట్లు తీసుకెళ్లే ప్రయాణీకుల కోసం ఒమన్ ఎయిర్ కొత్త గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. ఇకపై పవర్ బ్యాంకులను హ్యాండ్ లగేజీలో మాత్రమే తీసుకెళ్లాలి. వాటిని ఫ్లైట్ లో ఉపయోగించకూడదు లేదా ఛార్జ్ చేయకూడదు. దెబ్బతిన్న లేదా లేబుల్ చేయని పవర్ బ్యాంకులపై నిషేధం విధించారు.
ఇ-సిగరెట్లు మరియు వేప్లను హ్యాండ్ లగేజీలో మాత్రమే అనుమతిస్తారు. వాటిని కూడా ఫ్లైట్ ఉపయోగించేందుకు అనుమతించరు. అయితే, ప్రయాణీకులు విమానంలోని ఛార్జింగ్ పోర్టులను ఉపయోగించి ఫోన్లు మరియు టాబ్లెట్లు వంటి వారి వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాలను (PEDలు) ఛార్జ్ చేసుకోవచ్చు. విమాన ప్రయాణంలో బ్యాటరీలు, పవర్ బ్యాంకులు మరియు ఇ-సిగరెట్లను ఛార్జ్ చేయకూడదు.
లిథియం బ్యాటరీతో నడిచే వ్యక్తిగత రవాణా పరికరాలు అయిన హోవర్బోర్డులు, బ్యాలెన్స్ వీల్స్, మినీ-స్కూటర్లు వంటి వస్తువులను చెక్డ్ లేదా క్యారీ-ఆన్ లగేజీగా విమానంలో అనుమతించరని ఎయిర్లైన్ తెలియజేసింది. ప్రయాణీకులకు అత్యున్నత భద్రతను అందించేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో ఇది భాగమని ఒమన్ ఎయిర్ తెలిపింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









