మస్కట్ లో ఏపీ వాసి మృతి
- November 13, 2025
మస్కట్: ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం వెదుళ్లువలస గ్రామానికి చెందిన సవలాపురపు నాగమణి(28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.తమ కుమార్తె నాగమణి గతంలో నాలుగేళ్లు అక్కడ పనిచేసి డబ్బులు పంపించేదని ఇటీవల ఇంటికి వచ్చి కొంతకాలం ఉండి మళ్లీ పని కోసం వెళ్లి నాలుగు నెలలు అయిందని మృతురాలు తల్లి సరోజిని బుధవారం తెలిపారు. ఒక ఏజెంట్ ద్వారా అక్కడికి పనికి వెళ్లారని చెప్పారు. నాగమణి మూడు రోజుల క్రితం ఫోన్ చేసి తనకు ఇక్కడ చాలా తీవ్ర ఇబ్బంది పెడుతూ, వేధిస్తున్నారు…స్వగ్రామం వచ్చేస్తానని చెప్పిందని, ఇబ్బందిగా ఉంటే వచ్చేమని తాము చెప్పామని వివరించారు. కానీ ఏం జరిగిందో తెలియదు అక్కడ ఏజెంట్ ఫోన్ చేసి మీ అమ్మాయి ఇక్కడ మస్కిట్లో ఆత్మహత్య చేసుకుందని చెప్పారని కన్నీరు మున్నీరయ్యారు.
ఆత్మహత్య చేసుకున్న ఫోటోలు పెట్టమని అడిగితే వాళ్ళు పెట్టట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుమార్తె నాగమణి మృతి చెందిన విషయాన్ని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకువెళ్లి అక్కడ నుంచి తమ కుమార్తె మృతదేహం వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నారని తెలిపారని పేర్కొన్నారు.ఈ విషయంలో మాకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుచున్నారు.
తాజా వార్తలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా
- భారత్ పై అమెరికన్ మహిళ ప్రశంసలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!







