$1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- November 13, 2025
యూఏఈ: దుబాయ్లో ఉన్న ఒక భారతీయ ప్రవాసి 522 సిరీస్లో టికెట్ నంబర్ 2242తో $1 మిలియన్ గెలుచుకున్నారు. సదరు భారతీయ బ్యాంకర్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో తాజా డాలర్ మిలియనీర్ అయ్యాడు.
1998 నుండి యూఏఈ, ఒమన్ మధ్య నివసిస్తున్న అతుల్ రావుకు, ఈ విజయం ఇప్పటికీ నమ్మశక్యంగా అనిపిస్తుంది. “నాకు కాల్ వచ్చినప్పుడు, ఎవరో నన్ను చిలిపిగా ఆట పట్టిస్తున్నారని అనుకున్నాను. ఈ రోజుల్లో మాకు చాలా స్పామ్ ఇమెయిల్లు మరియు మెసేజులు వస్తున్నాయి, నమ్మడం కష్టంగా ఉంది, ”అని ఒక బ్యాంకులో పనిచేస్తున్న రావు అన్నారు.
ముంబైలో జన్మించిన బ్యాంకర్ తన పుట్టినరోజున, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు తన అదృష్ట టిక్కెట్ను కొనుగోలు చేశాడు. అతను తన స్నేహితుడి వివాహం కోసం బాలికి విమానంలో వెళుతుండగా, తన అదృష్టాన్ని పరీక్షించుకొని టిక్కెట్ కొన్నట్లు తెలిపాడు. గెలిచిన మొత్తంలో కొంత భాగాన్ని దాతృత్వానికి, తెలివైన పెట్టుబడుల కోసం కొంత ఆస్తిని కొనాలని యోచిస్తున్నట్లు అతుల్ రావు చెప్పారు.
తాజా వార్తలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా
- భారత్ పై అమెరికన్ మహిళ ప్రశంసలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!







