$1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- November 13, 2025
యూఏఈ: దుబాయ్లో ఉన్న ఒక భారతీయ ప్రవాసి 522 సిరీస్లో టికెట్ నంబర్ 2242తో $1 మిలియన్ గెలుచుకున్నారు. సదరు భారతీయ బ్యాంకర్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో తాజా డాలర్ మిలియనీర్ అయ్యాడు.
1998 నుండి యూఏఈ, ఒమన్ మధ్య నివసిస్తున్న అతుల్ రావుకు, ఈ విజయం ఇప్పటికీ నమ్మశక్యంగా అనిపిస్తుంది. “నాకు కాల్ వచ్చినప్పుడు, ఎవరో నన్ను చిలిపిగా ఆట పట్టిస్తున్నారని అనుకున్నాను. ఈ రోజుల్లో మాకు చాలా స్పామ్ ఇమెయిల్లు మరియు మెసేజులు వస్తున్నాయి, నమ్మడం కష్టంగా ఉంది, ”అని ఒక బ్యాంకులో పనిచేస్తున్న రావు అన్నారు.
ముంబైలో జన్మించిన బ్యాంకర్ తన పుట్టినరోజున, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు తన అదృష్ట టిక్కెట్ను కొనుగోలు చేశాడు. అతను తన స్నేహితుడి వివాహం కోసం బాలికి విమానంలో వెళుతుండగా, తన అదృష్టాన్ని పరీక్షించుకొని టిక్కెట్ కొన్నట్లు తెలిపాడు. గెలిచిన మొత్తంలో కొంత భాగాన్ని దాతృత్వానికి, తెలివైన పెట్టుబడుల కోసం కొంత ఆస్తిని కొనాలని యోచిస్తున్నట్లు అతుల్ రావు చెప్పారు.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







