$1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- November 13, 2025
యూఏఈ: దుబాయ్లో ఉన్న ఒక భారతీయ ప్రవాసి 522 సిరీస్లో టికెట్ నంబర్ 2242తో $1 మిలియన్ గెలుచుకున్నారు. సదరు భారతీయ బ్యాంకర్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో తాజా డాలర్ మిలియనీర్ అయ్యాడు.
1998 నుండి యూఏఈ, ఒమన్ మధ్య నివసిస్తున్న అతుల్ రావుకు, ఈ విజయం ఇప్పటికీ నమ్మశక్యంగా అనిపిస్తుంది. “నాకు కాల్ వచ్చినప్పుడు, ఎవరో నన్ను చిలిపిగా ఆట పట్టిస్తున్నారని అనుకున్నాను. ఈ రోజుల్లో మాకు చాలా స్పామ్ ఇమెయిల్లు మరియు మెసేజులు వస్తున్నాయి, నమ్మడం కష్టంగా ఉంది, ”అని ఒక బ్యాంకులో పనిచేస్తున్న రావు అన్నారు.
ముంబైలో జన్మించిన బ్యాంకర్ తన పుట్టినరోజున, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు తన అదృష్ట టిక్కెట్ను కొనుగోలు చేశాడు. అతను తన స్నేహితుడి వివాహం కోసం బాలికి విమానంలో వెళుతుండగా, తన అదృష్టాన్ని పరీక్షించుకొని టిక్కెట్ కొన్నట్లు తెలిపాడు. గెలిచిన మొత్తంలో కొంత భాగాన్ని దాతృత్వానికి, తెలివైన పెట్టుబడుల కోసం కొంత ఆస్తిని కొనాలని యోచిస్తున్నట్లు అతుల్ రావు చెప్పారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









