$1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- November 13, 2025
యూఏఈ: దుబాయ్లో ఉన్న ఒక భారతీయ ప్రవాసి 522 సిరీస్లో టికెట్ నంబర్ 2242తో $1 మిలియన్ గెలుచుకున్నారు. సదరు భారతీయ బ్యాంకర్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో తాజా డాలర్ మిలియనీర్ అయ్యాడు.
1998 నుండి యూఏఈ, ఒమన్ మధ్య నివసిస్తున్న అతుల్ రావుకు, ఈ విజయం ఇప్పటికీ నమ్మశక్యంగా అనిపిస్తుంది. “నాకు కాల్ వచ్చినప్పుడు, ఎవరో నన్ను చిలిపిగా ఆట పట్టిస్తున్నారని అనుకున్నాను. ఈ రోజుల్లో మాకు చాలా స్పామ్ ఇమెయిల్లు మరియు మెసేజులు వస్తున్నాయి, నమ్మడం కష్టంగా ఉంది, ”అని ఒక బ్యాంకులో పనిచేస్తున్న రావు అన్నారు.
ముంబైలో జన్మించిన బ్యాంకర్ తన పుట్టినరోజున, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు తన అదృష్ట టిక్కెట్ను కొనుగోలు చేశాడు. అతను తన స్నేహితుడి వివాహం కోసం బాలికి విమానంలో వెళుతుండగా, తన అదృష్టాన్ని పరీక్షించుకొని టిక్కెట్ కొన్నట్లు తెలిపాడు. గెలిచిన మొత్తంలో కొంత భాగాన్ని దాతృత్వానికి, తెలివైన పెట్టుబడుల కోసం కొంత ఆస్తిని కొనాలని యోచిస్తున్నట్లు అతుల్ రావు చెప్పారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!







