పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు

- November 13, 2025 , by Maagulf
పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు

న్యూ ఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్‌(EPFO) నుంచి సొమ్ము విత్‌డ్రా చేసుకోవడం ఇప్పుడు మరింత సులభమైంది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను డిజిటల్‌గా మార్చి, ఇక పై ఈపీఎఫ్‌ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మొబైల్‌ ఫోన్‌ ద్వారా నిధులను విత్‌డ్రా చేసుకునే సౌకర్యం కల్పించింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న కొన్ని ఆప్షన్లకు అదనంగా మరికొన్ని కొత్త అవకాశాలను కూడా జోడించింది. దీంతో పీఎఫ్‌ సొమ్ము విత్‌డ్రా ప్రక్రియ పూర్తిగా సులభతరమైంది.

నిపుణుల ప్రకారం, ఇలా విత్‌డ్రా చేసిన సొమ్ముపై సాధారణంగా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయినప్పటికీ, ఇది భవిష్యత్‌ అవసరాల కోసం నిల్వ చేసే పొదుపు కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే విత్‌డ్రా చేయాలని వారు సూచిస్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వం కూడా నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది.

ఉద్యోగం ప్రారంభమైన ఐదు సంవత్సరాల లోపే పీఎఫ్‌(EPFO) సొమ్ము విత్‌డ్రా చేస్తే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఉద్యోగి రెండు సంస్థల్లో పనిచేసి, పాత ఖాతాను కొత్త సంస్థకు బదిలీ చేస్తే ఆ కాలం మొత్తం కలిపి ఐదు సంవత్సరాలు గడవాలి. పాత ఖాతా బదిలీ చేయకుండా కొత్తది తెరిస్తే లెక్క కొత్తగా మొదలవుతుంది. ఈ సందర్భంలో యజమాని చెల్లించిన భాగం మరియు దానిపై వచ్చిన వడ్డీపై పన్ను వర్తిస్తుంది. ఉద్యోగి ఆదాయాన్ని బట్టి పన్ను శ్లాబ్‌ నిర్ణయించబడుతుంది. అంతేకాక, పాన్‌ కార్డు వివరాలు సమర్పించకపోతే 34.60% టీడీఎస్‌ కట్‌ అవుతుంది.

ఐదు సంవత్సరాలకు మించి ఉన్న ఈపీఎఫ్‌ ఖాతాల్లో రూ.1.5 లక్షల వరకు (పాత పన్ను విధానంలో) మినహాయింపు లభిస్తుంది. కొత్త పన్ను విధానంలో మాత్రం యజమాని చెల్లించిన వాటాపై మాత్రమే మినహాయింపు వర్తిస్తుంది.రెండు విధానాల్లోనూ ఈపీఎఫ్‌ లోని డిపాజిట్లు, వడ్డీ, మెచ్యూరిటీ మొత్తాలు పూర్తిగా పన్ను రహితంగా పరిగణించబడతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com