సౌదీ అరేబియా: ఘోర బస్సు ప్రమాదం.. 42 మంది మృతి..
- November 17, 2025
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం భారతీయ ఉమ్రా యాత్రికులకు విషాదకరంగా మారింది. నవంబర్ 17, 2025న ఉదయం సుమారు 12:00 గంటలకు బదర్-మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.మక్కాలో ఉమ్రా యాత్రను ముగించుకుని మదీనాకు వెళ్తున్న బస్సు...డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 42 మంది భారతీయ యాత్రికులు మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మృతుల్లో 20 మంది మహిళలు,11 మంది చిన్నారులు ఉన్నారు. ఎక్కువ మంది మృతులు హైదరాబాద్కు చెందిన వారని తెలుస్తోంది. బస్సులో ఉన్న యాత్రికులు చాలామంది నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ దుర్ఘటన సౌదీ అరేబియాలోని ముస్లిం పవిత్ర ప్రదేశాల మధ్య రహదారిపై జరిగింది. ఉమ్రా యాత్రికులు మక్కా మసీద్ అల్హరామ్లో ప్రార్థనలు, తౌవాఫ్ వంటి కార్యక్రమాలు పూర్తి చేసి, మదీనాలోని మసిద్ అన్-నబవీని సందర్శించేందుకు ప్రయాణిస్తున్నారు. ఈ మార్గం భారతీయ యాత్రికులకు సాధారణంగా ఉపయోగించే రహదారి కావడంతో, ఈ ప్రమాదం భారతదేశంలో విషాదాన్ని కలిగించింది. మృతుల్లో హైదరాబాద్, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కుటుంబాలకు చెందినవారు ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో ఒకరి కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









