సౌదీ అరేబియా: ఘోర బస్సు ప్రమాదం.. 42 మంది మృతి..
- November 17, 2025
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం భారతీయ ఉమ్రా యాత్రికులకు విషాదకరంగా మారింది. నవంబర్ 17, 2025న ఉదయం సుమారు 12:00 గంటలకు బదర్-మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.మక్కాలో ఉమ్రా యాత్రను ముగించుకుని మదీనాకు వెళ్తున్న బస్సు...డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 42 మంది భారతీయ యాత్రికులు మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మృతుల్లో 20 మంది మహిళలు,11 మంది చిన్నారులు ఉన్నారు. ఎక్కువ మంది మృతులు హైదరాబాద్కు చెందిన వారని తెలుస్తోంది. బస్సులో ఉన్న యాత్రికులు చాలామంది నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ దుర్ఘటన సౌదీ అరేబియాలోని ముస్లిం పవిత్ర ప్రదేశాల మధ్య రహదారిపై జరిగింది. ఉమ్రా యాత్రికులు మక్కా మసీద్ అల్హరామ్లో ప్రార్థనలు, తౌవాఫ్ వంటి కార్యక్రమాలు పూర్తి చేసి, మదీనాలోని మసిద్ అన్-నబవీని సందర్శించేందుకు ప్రయాణిస్తున్నారు. ఈ మార్గం భారతీయ యాత్రికులకు సాధారణంగా ఉపయోగించే రహదారి కావడంతో, ఈ ప్రమాదం భారతదేశంలో విషాదాన్ని కలిగించింది. మృతుల్లో హైదరాబాద్, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కుటుంబాలకు చెందినవారు ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో ఒకరి కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.
తాజా వార్తలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా
- భారత్ పై అమెరికన్ మహిళ ప్రశంసలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!







