సౌదీ అరేబియా: ఘోర బస్సు ప్రమాదం.. 42 మంది మృతి..

- November 17, 2025 , by Maagulf
సౌదీ అరేబియా: ఘోర బస్సు ప్రమాదం.. 42 మంది మృతి..

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం భారతీయ ఉమ్రా యాత్రికులకు విషాదకరంగా మారింది. నవంబర్ 17, 2025న ఉదయం సుమారు 12:00 గంటలకు  బదర్-మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.మక్కాలో ఉమ్రా యాత్రను ముగించుకుని మదీనాకు వెళ్తున్న బస్సు...డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 42 మంది భారతీయ యాత్రికులు మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మృతుల్లో 20 మంది మహిళలు,11 మంది చిన్నారులు ఉన్నారు. ఎక్కువ మంది మృతులు హైదరాబాద్‌కు చెందిన వారని తెలుస్తోంది. బస్సులో ఉన్న యాత్రికులు చాలామంది నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది.

ఈ దుర్ఘటన సౌదీ అరేబియాలోని ముస్లిం పవిత్ర ప్రదేశాల మధ్య రహదారిపై జరిగింది. ఉమ్రా యాత్రికులు మక్కా మసీద్ అల్‌హరామ్‌లో ప్రార్థనలు, తౌవాఫ్ వంటి కార్యక్రమాలు పూర్తి చేసి, మదీనాలోని మసిద్ అన్-నబవీని సందర్శించేందుకు ప్రయాణిస్తున్నారు. ఈ మార్గం భారతీయ యాత్రికులకు సాధారణంగా ఉపయోగించే రహదారి కావడంతో, ఈ ప్రమాదం భారతదేశంలో విషాదాన్ని కలిగించింది. మృతుల్లో హైదరాబాద్, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కుటుంబాలకు చెందినవారు ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో ఒకరి కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com