కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- November 17, 2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయా (KGBV)ల్లో చదువుతున్న విద్యార్థినుల ఆరోగ్య రక్షణ కోసం పాఠశాల విద్యా శాఖ ప్రత్యేకచర్యలు తీసుకోనుంది. విద్యార్థినుల ఆరోగ్య రక్షణకోసం హైదరాబాద్ లోని పాఠశాల విద్య డైరక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక్కడ ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్లో ఒక ఎంబిబిఎస్ డాక్టర్ను నియమించనున్నారు. స్థానికంగా ఉన్న కేజీబీవీల్లోని విద్యార్థినుల్లో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారికి వచ్చిన ఆరోగ్య సమస్యలను అక్కడే ఉన్న ఏఎన్ఎం ద్వారా కమాండ్ కంట్రోల్లో ఉన్న డాక్టర్కు వివరిస్తారు. సమస్యను తెలుసుకున్న అనంతరం డాక్టర్ పిల్లలకు అవసరమైన మందులను కానీ లేదంటే అవసరమైన చికిత్సను గానీ అదీ కాకుండా ఇన్పషంట్గా ఆసుపత్రిలో చేర్పించాల్సి వస్తే అటువంటి విషయాన్ని ఏఎన్ఎంకు వివరిస్తారు. తద్వారా వారికి వెంటనే చికిత్సను అందించాలని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









