కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- November 17, 2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయా (KGBV)ల్లో చదువుతున్న విద్యార్థినుల ఆరోగ్య రక్షణ కోసం పాఠశాల విద్యా శాఖ ప్రత్యేకచర్యలు తీసుకోనుంది. విద్యార్థినుల ఆరోగ్య రక్షణకోసం హైదరాబాద్ లోని పాఠశాల విద్య డైరక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక్కడ ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్లో ఒక ఎంబిబిఎస్ డాక్టర్ను నియమించనున్నారు. స్థానికంగా ఉన్న కేజీబీవీల్లోని విద్యార్థినుల్లో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారికి వచ్చిన ఆరోగ్య సమస్యలను అక్కడే ఉన్న ఏఎన్ఎం ద్వారా కమాండ్ కంట్రోల్లో ఉన్న డాక్టర్కు వివరిస్తారు. సమస్యను తెలుసుకున్న అనంతరం డాక్టర్ పిల్లలకు అవసరమైన మందులను కానీ లేదంటే అవసరమైన చికిత్సను గానీ అదీ కాకుండా ఇన్పషంట్గా ఆసుపత్రిలో చేర్పించాల్సి వస్తే అటువంటి విషయాన్ని ఏఎన్ఎంకు వివరిస్తారు. తద్వారా వారికి వెంటనే చికిత్సను అందించాలని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- లక్నోలో ఫైనాన్స్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
- 21 వేల సినిమాలు..రూ.20 కోట్ల సంపాదన షాకింగ్ విషయాలు చెప్పిన సీపీ సజ్జనార్
- కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్గా కీర్తి సురేశ్
- యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- సౌదీ అరేబియాలో 1,383 మంది అరెస్టు..!!
- జబల్ అఖ్దర్లో టూరిస్టును రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- యునైటెడ్ ఇండియన్ స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్లో ఇక ఈజీగా వీసా ట్రాన్స్ ఫర్స్..!!
- ఖతార్ మ్యూజియంలో కొత్త రువాద్ రెసిడెన్సీ ఎగ్జిబిషన్లు..!!







