'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- November 17, 2025
మనామా: బహ్రెయిన్లో డిసెంబర్ 15వ తేదీన క్రౌన్ ప్లాజా ఆడిటోరియంలో జరగనున్న మెగా ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ 'నిరం 2025' టిక్కెట్లను ఆవిష్కరించారు. సల్మానియాలోని కె సిటీ ఆడిటోరియంలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మొదటి టికెట్ను SPAC గ్రూప్ చైర్మన్ పి. ఉన్నికృష్ణన్, ఆమ్సర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ పార్వతికి అధికారికంగా అందజేశారు.
హ్యాపీ హ్యాండ్స్ పబ్లిసిటీ అండ్ అడ్వర్టైజింగ్ బ్యానర్పై నిర్వహించనున్న 'నిరం 2025'లో మలయాళ సినిమా, సంగీత పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఈవేడుకలో పాల్గొంటారు. నటుడు కుంచాకో బోబన్, గాయకుడు ఎం. జి. శ్రీకుమార్, నటుడు మరియు దర్శకుడు రమేష్ పిషారోడి, నేపథ్య గాయకుడు సిఖా హాజరయ్యే వారిలో ఉన్నారు. టిక్కెట్ల ఆవిష్కరణ కార్యక్రమంలో కేరళ సమాజం అధ్యక్షుడు పి.వి.రాధాకృష్ణ పిళ్లై; నిరం నిర్మాత బైజు కె.ఎస్.; ప్రోగ్రామ్ డైరెక్టర్ మురళీధరన్ పల్లియత్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..







