ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- November 17, 2025
దోహా: ఖతార్ విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ 2025–2026 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కాలర్షిప్ పొందిన వారి వివరాలను ప్రకటించింది.ఖతార్ మరియు విదేశాలలో వివిధ విభాగాలలో సుమారు 850 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేయనుంది.ఈమేరకు విద్యా మంత్రిత్వ శాఖలోని కెరీర్ గైడెన్స్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కన్సల్టెంట్ సలేహ్ మొహమ్మద్ అల్-ముఫ్తా వివరాలను వెల్లడించారు.
జూలై 1 నుండి ఆగస్టు 30 వరకు స్కాలర్షిప్ దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించిందని, 3,700 దరఖాస్తులు అందాయని చెప్పారు.ఇప్పటి వరకు దాదాపు 90శాతం దరఖాస్తులను ప్రాసెస్ చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం స్పాన్సర్షిప్ పొందిన 850 మంది విద్యార్థులలో, దాదాపు 250 మంది విదేశాలలో చదువుతున్నారని, మరో 600 మంది ఖతార్లోని వివిధ యూనివర్సిటీలలో చేరినట్లు వెల్లడించారు.
ఖతార్ నేషనల్ విజన్ 2030కి అనుగుణంగా వివిధ డిప్లొమాలు, బ్యాచిలర్లు మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను కలిగి ఉన్న ఖతారీల సంఖ్యను పెంచడం ఈ స్కాలర్షిప్ విధాన లక్ష్యం అని అల్-ముఫ్తా పేర్కొన్నారు. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లినికల్ సైకాలజీ, న్యూరోసైన్స్ మరియు వంటి స్పెషలైజేషన్లను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు అల్-ముఫ్తా వివరించారు.
తాజా వార్తలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా
- భారత్ పై అమెరికన్ మహిళ ప్రశంసలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!







