యూఎన్ గాజా పునర్నిర్మాణం.. బహ్రెయిన్ మద్దతు..!!
- November 19, 2025
మనామా: గాజా స్ట్రిప్లో పునర్నిర్మాణానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని బహ్రెయిన్ స్వాగతించింది. యూఎన్ ప్రణాళికకు పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించింది. కాల్పుల విరమణను పటిష్టం చేయడం, పునర్నిర్మాణం మరియు పునరుద్ధరణ నిధుల కోసం "శాంతి మండలి"ని ఏర్పాటు చేయనున్నారు. అదే సమయంలో ప్రజలను రక్షించడానికి, నిరాయుధీకరణను అమలు చేయడానికి మద్దతుగా ఉంటామని తెలిపారు. ఈ చర్యలు అంతర్జాతీయ చట్టం మరియు అంతర్జాతీయ మానవతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
పాలస్తీనా ప్రజలు తమ స్వయం నిర్ణయాధికార హక్కును వినియోగించుకోవడానికి మరియు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడానికి మార్గం సుగమం చేసే చారిత్రాత్మక మైలురాయిగా దీనిని అభివర్ణిస్తూ, ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని అమలు చేయడానికి బహ్రెయిన్ తన పూర్తి మద్దతును తెలిపింది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







