ఖతార్ లో NCD స్క్రీనింగ్ కేంద్రాలు పెంపు..!!
- November 21, 2025
దోహా: ఖతార్ లో నాన్-కమ్యూనికబుల్ డిసీజ్ (NCD) స్క్రీనింగ్ కార్యక్రమాలను మరింత మందికి చేరువ చేసేందుకు వీలుగా కేంద్రాలను పెంచనున్నారు. ముందస్తు గుర్తింపు, ఆరోగ్య సంరక్షణ మరియు దీర్ఘకాలిక వ్యాధి నివారణకు ఇవి దోహదం చేస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఖతార్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నవంబర్ ఎడిషన్లో ఒక అధ్యయనాన్ని ప్రచురించారు.
నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ స్క్రీనింగ్ అనేది ప్రారంభ దశల్లో వ్యాధులను గుర్తించడంలోనే కాకుండా జీవన నాణ్యతను మెరుగుపరచడంలో, సమస్యలను తగ్గించడంలో మరియు అకాల మరణాలను నివారించడంలో సహాయపడుతుందని వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సంస్థ (PHCC) నివేదికలు మరియు స్థానిక అధ్యయనాల ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించినట్లు పేర్కొన్నారు.
2017లో ఖతారీ వాసులకు వార్షిక ఆరోగ్య తనిఖీలు ప్రవేశపెట్టారు. 2022లో ప్రీడయాబెటిస్, రక్తపోటు మరియు ఒబెసిటీ వంటి లైఫ్ స్టైల్ డిజిజెస్ ను గుర్తించడానికి విస్తరించారు. క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. 2024లో 79.5శాతానికి స్క్రీనింగ్ కవరేజ్ పెరిగింది. రాబోయే రోజులలో మరింత మందికి ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేసేందుకు వీలుగా కేంద్రాల సంఖ్యను పెంచనున్నట్లు ఖతార్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







