ఒమానీ రియాల్తో.. జీవితకాల కనిష్ట స్థాయికి రూపాయి..!!
- November 23, 2025
మస్కట్: అమెరికా డాలర్తో పోలిస్తే శుక్రవారం రూపాయి విలువ 89.48 కి చేరుకొని జీవితకాల కనిష్ట స్థాయికి చేరుకుంది. గత మూడు నెలల్లో ఇది అత్యధిక సింగిల్ డే పతనం అని ఆర్థిక రంగ నిపుణులు తెలిపారు. ఒమన్లో రియాల్తో పోలిస్తే భారత రూపాయి 232.25కి చేరిందని ఆర్థికరంగ నిపుణుడు ఆర్. మధుసూదనన్ చెప్పారు. 2025లో భారత రూపాయి విలువ దాదాపు 4.5 శాతం తగ్గిందని అన్నారు.
భారతదేశ కరెంట్ అకౌంట్ లోటు (CAD) GDPలో 1.7 శాతం పెరిగే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఎగుమతి ఆదాయాలు ప్రభావితమవడం మరియు ముడి చమురుతో పాటు బంగారం మరియు వెండి దిగుమతులు పెరగడం దీనికి ప్రధాన కారణం అని వెల్లడించారు. అయితే, రాబోయే రోజుల్లో అమెరికాతో వాణిజ్య ఒప్పందం కొలిక్కి వస్తే భారత రూపాయి బలపడే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- AI పరిశోధనలకు బిట్స్ పిలానీ–ఐఏఐఆర్వో భాగస్వామ్యం..
- అమెరికాలో జూలైలో 23 వేల ఉద్యోగాల కోత..
- 'AI'తో కొత్త ఉద్యోగాలు !!
- సౌదీ–టర్కీ–పాకిస్థాన్ మధ్య 'మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం'..
- జీఎస్టీ ఆదాయం పెంపునకు ఏఐ వినియోగం..కొత్త కార్యాచరణపై సీఎం రేవంత్ సమీక్ష
- ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ భగ్నం..
- ఫార్వర్డ్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి.. ప్రజలకు కీలక సూచనలు జారీ చేసిన TDRA
- గుడివాడ–శివమొగ్గ ప్రత్యేక రైలుకు గ్రీన్ సిగ్నల్ దిశగా ముందడుగు.. ఎంపీ బాలశౌరి కృషికి ఫలితం
- యూఏఈలో భారతీయులకు పాస్పోర్ట్, కాన్సులర్ సేవలను మరింత వేగవంతం
- యూఏఈ–రష్యా అధ్యక్షుల ఫోన్ సంభాషణ.. ద్వైపాక్షిక సహకారం, మిడిల్ ఈస్ట్ పరిణామాలపై చర్చ







