కేరళ వైరల్ బాధితురాలికి అండగా యూఏఈ డాక్టర్..!!
- November 24, 2025
యూఏఈ: కేరళకు చెందిన ఓ మహిళ వివాహానికి ముందు యాక్సిడెంట్ కు గురై ఆస్పత్రి పాలైంది. కొచ్చిలోని VPS లేక్షోర్ హాస్పిటల్లోని అత్యవసర వార్డులో చికిత్స పొందుతూ.. ముందుగా నిర్ణయించిన ముహుర్తం ప్రకారం వివాహం చేసుకుంది. ఈ ఆస్పత్రి వెడ్డింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో VPS లేక్షోర్ హాస్పిటల్ ఛైర్మన్ , యూఏఈకి చెందిన డాక్టర్ షంషీర్ వాయలీల్ ఆమెకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. ఆయన మద్దతుతో ఆమెకు వెన్నెముక ఆపరేషన్ విజయవంతంగా జరిగింది.
అంతకుమందు డాక్టర్ షంషీర్, 23 ఏళ్ల అవని వైద్య సంరక్షణ పూర్తి ఖర్చులను భరించాలని ఆసుపత్రి వర్గాలను ఆదేశించారు. అవని కోలుకునేంత వరకు పూర్తి మద్దతు ఇస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్థికంగా అండగా నిలిచిన డాక్టర్ షంషీర్ కు అవని కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?









