కేరళ వైరల్ బాధితురాలికి అండగా యూఏఈ డాక్టర్..!!
- November 24, 2025
యూఏఈ: కేరళకు చెందిన ఓ మహిళ వివాహానికి ముందు యాక్సిడెంట్ కు గురై ఆస్పత్రి పాలైంది. కొచ్చిలోని VPS లేక్షోర్ హాస్పిటల్లోని అత్యవసర వార్డులో చికిత్స పొందుతూ.. ముందుగా నిర్ణయించిన ముహుర్తం ప్రకారం వివాహం చేసుకుంది. ఈ ఆస్పత్రి వెడ్డింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో VPS లేక్షోర్ హాస్పిటల్ ఛైర్మన్ , యూఏఈకి చెందిన డాక్టర్ షంషీర్ వాయలీల్ ఆమెకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. ఆయన మద్దతుతో ఆమెకు వెన్నెముక ఆపరేషన్ విజయవంతంగా జరిగింది.
అంతకుమందు డాక్టర్ షంషీర్, 23 ఏళ్ల అవని వైద్య సంరక్షణ పూర్తి ఖర్చులను భరించాలని ఆసుపత్రి వర్గాలను ఆదేశించారు. అవని కోలుకునేంత వరకు పూర్తి మద్దతు ఇస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్థికంగా అండగా నిలిచిన డాక్టర్ షంషీర్ కు అవని కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







