కేరళ వైరల్ బాధితురాలికి అండగా యూఏఈ డాక్టర్..!!
- November 24, 2025
యూఏఈ: కేరళకు చెందిన ఓ మహిళ వివాహానికి ముందు యాక్సిడెంట్ కు గురై ఆస్పత్రి పాలైంది. కొచ్చిలోని VPS లేక్షోర్ హాస్పిటల్లోని అత్యవసర వార్డులో చికిత్స పొందుతూ.. ముందుగా నిర్ణయించిన ముహుర్తం ప్రకారం వివాహం చేసుకుంది. ఈ ఆస్పత్రి వెడ్డింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో VPS లేక్షోర్ హాస్పిటల్ ఛైర్మన్ , యూఏఈకి చెందిన డాక్టర్ షంషీర్ వాయలీల్ ఆమెకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. ఆయన మద్దతుతో ఆమెకు వెన్నెముక ఆపరేషన్ విజయవంతంగా జరిగింది.
అంతకుమందు డాక్టర్ షంషీర్, 23 ఏళ్ల అవని వైద్య సంరక్షణ పూర్తి ఖర్చులను భరించాలని ఆసుపత్రి వర్గాలను ఆదేశించారు. అవని కోలుకునేంత వరకు పూర్తి మద్దతు ఇస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్థికంగా అండగా నిలిచిన డాక్టర్ షంషీర్ కు అవని కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







