సౌదీ అరేబియాలో 3.2 కి.మీ సీ బ్రిడ్జ్ ప్రారంభం..!!
- November 24, 2025
దమ్మామ్: సౌదీ అరేబియాలోని ఖాతిఫ్ లోని సఫ్వాను రాస్ తనూరాతో కలిపే కొత్త 15 కిలోమీటర్ల సఫ్వా–రహిమా రోడ్డును తూర్పు ప్రావిన్స్ ఎమిర్ ప్రిన్స్ సౌద్ బిన్ నయేఫ్ ప్రారంభించారు.ఈ ప్రాజెక్టులో 3.2 కిలోమీటర్ల జంట సీ బ్రిడ్జ్ ప్రధాన ఆకర్షణగా ఉంది. ఇది అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయాలు గణనీయంగా తగ్గడంతోపాటు ఈ ప్రాంతం లో పెరుగుతున్న ఆర్థిక మరియు లాజిస్టిక్స్ కార్యకలాపాలకు మద్దతు ఇస్తుందని ప్రకటించారు.
కొత్తగా ప్రారంభించిన సీ బ్రిడ్జ్ రాస్ తనూరా పోర్టుకు డైరెక్ట్, అదనపు యాక్సెస్ పాయింట్ను అందిస్తుందని రవాణా శాఖ మంత్రి అల్-జాసర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా మరియు లాజిస్టిక్స్ సేవల మంత్రి సలేహ్ అల్-జాసర్, జనరల్ అథారిటీ ఫర్ రోడ్స్ ఇంజినీర్ బదర్ అల్-దులైమి మరియు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









