టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- November 25, 2025
మెన్స్ టీ20 వరల్డ్ కప్-2026 షెడ్యూల్ వచ్చేసింది.షెడ్యూల్ ను ఐసీసీ రిలీజ్ చేసింది. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది.తొలి మ్యాచ్ కొలంబో వేదికగా ఫిబ్రవరి 7న పాకిస్తాన్-నెదర్లాండ్స్ మధ్య జరగనుంది. అదే రోజు ముంబై వేదికగా భారత్ యూఎస్ఏతో తలపడనుంది.
ఇక ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ప్రేమదాస స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. మార్చి 8న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్, పాకిస్తాన్, యూఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్ ఒకే గ్రూప్ లో ఉన్నాయి.
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. మ్యాచ్లు భారత్లోని 5 వేదికల్లో (అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై).. శ్రీలంకలోని 3 వేదికల్లో (క్యాండీలోని పల్లెకెలె స్టేడియం, కొలంబోలోని రెండు స్టేడియాల్లో) జరగనున్నాయి. 2024 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మను ఈ సీజన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు.
- ఫిబ్రవరి 7, 2026 – భారత్ వర్సెస్ USA (ముంబై)
- ఫిబ్రవరి 12, 2026 – భారత్ vs నమీబియా (ఢిల్లీ)
- ఫిబ్రవరి 15, 2026 – భారత్ vs పాకిస్తాన్ (కొలంబో)
- ఫిబ్రవరి 18, 2026 – భారత్ vs నెదర్లాండ్స్ (అహ్మదాబాద్)
గత ఎడిషన్ లో లానే ఈసారి కూడా 20 జట్లు పాల్గొననున్నాయి. ఇటలీ మొదటిసారి టోర్నీకి అర్హత సాధించింది. 20 జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి రెండేసి జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. సూపర్-8లోని 4 జట్లను రెండు గ్రూప్లుగా విభజిస్తారు. ఇందులో టాప్-2 జట్లు సెమీ ఫైనల్కు వెళ్తాయి.
షెడ్యూల్ విడుదల కార్యక్రమంలో భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ, భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, భారత హిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ పాల్గొన్నారు.
- గ్రూప్ ఏ: భారత్, పాకిస్థాన్, యూఎస్ఏ, నెదర్లాండ్స్, నమీబియా
- గ్రూప్ బి: ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్
- గ్రూప్ సి: ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ
- గ్రూప్ డి: సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అప్ఘానిస్థాన్, కెనాడా, యూఏఈ
తాజా వార్తలు
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్న్యూస్
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్కు కొత్త అద్దె సూచిక.. కొత్త చట్టంతో పారదర్శకతకు ప్రాధాన్యం
- కువైట్లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్లో అల్ అమెరికాత్ ఓవర్పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే







