టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- November 25, 2025
మెన్స్ టీ20 వరల్డ్ కప్-2026 షెడ్యూల్ వచ్చేసింది.షెడ్యూల్ ను ఐసీసీ రిలీజ్ చేసింది. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది.తొలి మ్యాచ్ కొలంబో వేదికగా ఫిబ్రవరి 7న పాకిస్తాన్-నెదర్లాండ్స్ మధ్య జరగనుంది. అదే రోజు ముంబై వేదికగా భారత్ యూఎస్ఏతో తలపడనుంది.
ఇక ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ప్రేమదాస స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. మార్చి 8న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్, పాకిస్తాన్, యూఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్ ఒకే గ్రూప్ లో ఉన్నాయి.
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. మ్యాచ్లు భారత్లోని 5 వేదికల్లో (అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై).. శ్రీలంకలోని 3 వేదికల్లో (క్యాండీలోని పల్లెకెలె స్టేడియం, కొలంబోలోని రెండు స్టేడియాల్లో) జరగనున్నాయి. 2024 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మను ఈ సీజన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు.
- ఫిబ్రవరి 7, 2026 – భారత్ వర్సెస్ USA (ముంబై)
- ఫిబ్రవరి 12, 2026 – భారత్ vs నమీబియా (ఢిల్లీ)
- ఫిబ్రవరి 15, 2026 – భారత్ vs పాకిస్తాన్ (కొలంబో)
- ఫిబ్రవరి 18, 2026 – భారత్ vs నెదర్లాండ్స్ (అహ్మదాబాద్)
గత ఎడిషన్ లో లానే ఈసారి కూడా 20 జట్లు పాల్గొననున్నాయి. ఇటలీ మొదటిసారి టోర్నీకి అర్హత సాధించింది. 20 జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి రెండేసి జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. సూపర్-8లోని 4 జట్లను రెండు గ్రూప్లుగా విభజిస్తారు. ఇందులో టాప్-2 జట్లు సెమీ ఫైనల్కు వెళ్తాయి.
షెడ్యూల్ విడుదల కార్యక్రమంలో భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ, భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, భారత హిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ పాల్గొన్నారు.
- గ్రూప్ ఏ: భారత్, పాకిస్థాన్, యూఎస్ఏ, నెదర్లాండ్స్, నమీబియా
- గ్రూప్ బి: ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్
- గ్రూప్ సి: ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ
- గ్రూప్ డి: సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అప్ఘానిస్థాన్, కెనాడా, యూఏఈ
తాజా వార్తలు
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!









