ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- November 26, 2025
మస్కట్: ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. అదఖిలియా గవర్నర్ షేక్ హిలాల్ బిన్ సయీద్ అల్ హజ్రీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు.ఈ ఎగ్జిబిషన్ లో ఆనాటి రాజ కుటుంబం ఉపయోగించిన వాహనాలతోపాటు, చారిత్రక నేపథ్యం ఉన్న వాటిని ఒకేచోట చూసే అవకాశం ఉందని ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియం డైరెక్టర్ జనరల్ అల్ యఖ్ధాన్ అబ్దుల్లా అల్ హార్తీ తెలిపారు.
ఈ ప్రదర్శనలో క్లాసిక్, స్పోర్ట్స్ మరియు లగ్జరీ రాయల్ కార్ల విభిన్న కలెక్షన్స్ ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్లు ఒమానీ చరిత్రను తెలియజేస్తాయని, ప్రత్యేక జాతీయ కోణాన్ని అందిస్తాయని తెలిపారు. ఈ కార్లను వాటి చారిత్రక విలువ మరియు అరుదైన వాటి ఆధారంగా ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు.
అల్ బరాకా ప్యాలెస్లోని రాయల్ కార్స్ మ్యూజియంలో ఉన్న కొన్ని కార్లను కూడా ఇక్కడి ఎగ్జిబిషన్ లో చూడవచ్చని తెలిపారు. ఈ వింటేజ్ కార్ల ఎగ్జిబిషన్ డిసెంబర్ 9 వరకు కొనసాగుతుందని, ఉదయం 9:00 నుండి రాత్రి 9:00 వరకు సందర్శకులు రావచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









