ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- November 26, 2025
మస్కట్: ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. అదఖిలియా గవర్నర్ షేక్ హిలాల్ బిన్ సయీద్ అల్ హజ్రీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు.ఈ ఎగ్జిబిషన్ లో ఆనాటి రాజ కుటుంబం ఉపయోగించిన వాహనాలతోపాటు, చారిత్రక నేపథ్యం ఉన్న వాటిని ఒకేచోట చూసే అవకాశం ఉందని ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియం డైరెక్టర్ జనరల్ అల్ యఖ్ధాన్ అబ్దుల్లా అల్ హార్తీ తెలిపారు.
ఈ ప్రదర్శనలో క్లాసిక్, స్పోర్ట్స్ మరియు లగ్జరీ రాయల్ కార్ల విభిన్న కలెక్షన్స్ ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్లు ఒమానీ చరిత్రను తెలియజేస్తాయని, ప్రత్యేక జాతీయ కోణాన్ని అందిస్తాయని తెలిపారు. ఈ కార్లను వాటి చారిత్రక విలువ మరియు అరుదైన వాటి ఆధారంగా ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు.
అల్ బరాకా ప్యాలెస్లోని రాయల్ కార్స్ మ్యూజియంలో ఉన్న కొన్ని కార్లను కూడా ఇక్కడి ఎగ్జిబిషన్ లో చూడవచ్చని తెలిపారు. ఈ వింటేజ్ కార్ల ఎగ్జిబిషన్ డిసెంబర్ 9 వరకు కొనసాగుతుందని, ఉదయం 9:00 నుండి రాత్రి 9:00 వరకు సందర్శకులు రావచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







