ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- November 26, 2025
మస్కట్: ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. అదఖిలియా గవర్నర్ షేక్ హిలాల్ బిన్ సయీద్ అల్ హజ్రీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు.ఈ ఎగ్జిబిషన్ లో ఆనాటి రాజ కుటుంబం ఉపయోగించిన వాహనాలతోపాటు, చారిత్రక నేపథ్యం ఉన్న వాటిని ఒకేచోట చూసే అవకాశం ఉందని ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియం డైరెక్టర్ జనరల్ అల్ యఖ్ధాన్ అబ్దుల్లా అల్ హార్తీ తెలిపారు.
ఈ ప్రదర్శనలో క్లాసిక్, స్పోర్ట్స్ మరియు లగ్జరీ రాయల్ కార్ల విభిన్న కలెక్షన్స్ ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్లు ఒమానీ చరిత్రను తెలియజేస్తాయని, ప్రత్యేక జాతీయ కోణాన్ని అందిస్తాయని తెలిపారు. ఈ కార్లను వాటి చారిత్రక విలువ మరియు అరుదైన వాటి ఆధారంగా ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు.
అల్ బరాకా ప్యాలెస్లోని రాయల్ కార్స్ మ్యూజియంలో ఉన్న కొన్ని కార్లను కూడా ఇక్కడి ఎగ్జిబిషన్ లో చూడవచ్చని తెలిపారు. ఈ వింటేజ్ కార్ల ఎగ్జిబిషన్ డిసెంబర్ 9 వరకు కొనసాగుతుందని, ఉదయం 9:00 నుండి రాత్రి 9:00 వరకు సందర్శకులు రావచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







