సౌదీ జనాభాలో 47.3% మందికి బాటిల్ వాటరే ఆధారం..!!
- November 27, 2025
రియాద్: సౌదీ అరేబియాలోని చాలా ఇళ్లకు ప్రాథమిక తాగునీటి సేవలు అందుతున్నాయని జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) విడుదల చేసిన నివేదిక తెలిపింది. ఈ మేరకు హౌస్ హోల్డ్ ఎన్విరాన్ మెంటల్ 2024 గణంకాలను విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం.. 99.8 శాతం ఇళ్లు సురక్షితమైన తాగునీటి సేవల నుండి ప్రయోజనం పొందుతున్నాయి. అయితే సౌదీ జనాభాలో 47.3 శాతం మంది ఇప్పటికీ బాటిల్ వాటర్ తాగునీటికి ప్రధాన వనరుగా ఉంది. 36.5 శాతం మంది పబ్లిక్ నెట్వర్క్ నీటిని వినియోగించగా, ట్యాంకర్ నీరు 15.8 శాతం మంది వినియోగిస్తున్నారు.
99.9 శాతం కుటుంబాలు ప్రాథమిక పారిశుధ్య సేవల నుండి ప్రయోజనం పొందుతున్నాయని, సురక్షితంగా నిర్వహించబడుతున్న పారిశుధ్య సేవలు 89.5 శాతానికి చేరుకున్నాయని గణాంకాలు తెలిపాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 59.3 శాతంగా ఉండగా, పట్టణ ప్రాంతాలు 93.7 శాతం కవరేజ్ రేటును నమోదు చేశాయి. వ్యర్థాల నిర్వహణ పరంగా, 99.9 శాతం కుటుంబాలు ప్రాథమిక వ్యర్థాల సేకరణ సేవల సురక్షిత నిర్వహణ నుండి ప్రయోజనం పొందుతున్నాయని, 43.9 శాతం కుటుంబాలు ప్రతిరోజూ ఇంటి లోపల వ్యర్థాలను పారవేస్తున్నారని నివేదిక గణంకాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









