సౌదీ జనాభాలో 47.3% మందికి బాటిల్ వాటరే ఆధారం..!!
- November 27, 2025
రియాద్: సౌదీ అరేబియాలోని చాలా ఇళ్లకు ప్రాథమిక తాగునీటి సేవలు అందుతున్నాయని జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) విడుదల చేసిన నివేదిక తెలిపింది. ఈ మేరకు హౌస్ హోల్డ్ ఎన్విరాన్ మెంటల్ 2024 గణంకాలను విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం.. 99.8 శాతం ఇళ్లు సురక్షితమైన తాగునీటి సేవల నుండి ప్రయోజనం పొందుతున్నాయి. అయితే సౌదీ జనాభాలో 47.3 శాతం మంది ఇప్పటికీ బాటిల్ వాటర్ తాగునీటికి ప్రధాన వనరుగా ఉంది. 36.5 శాతం మంది పబ్లిక్ నెట్వర్క్ నీటిని వినియోగించగా, ట్యాంకర్ నీరు 15.8 శాతం మంది వినియోగిస్తున్నారు.
99.9 శాతం కుటుంబాలు ప్రాథమిక పారిశుధ్య సేవల నుండి ప్రయోజనం పొందుతున్నాయని, సురక్షితంగా నిర్వహించబడుతున్న పారిశుధ్య సేవలు 89.5 శాతానికి చేరుకున్నాయని గణాంకాలు తెలిపాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 59.3 శాతంగా ఉండగా, పట్టణ ప్రాంతాలు 93.7 శాతం కవరేజ్ రేటును నమోదు చేశాయి. వ్యర్థాల నిర్వహణ పరంగా, 99.9 శాతం కుటుంబాలు ప్రాథమిక వ్యర్థాల సేకరణ సేవల సురక్షిత నిర్వహణ నుండి ప్రయోజనం పొందుతున్నాయని, 43.9 శాతం కుటుంబాలు ప్రతిరోజూ ఇంటి లోపల వ్యర్థాలను పారవేస్తున్నారని నివేదిక గణంకాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా
- భారత్ పై అమెరికన్ మహిళ ప్రశంసలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!







