పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- November 27, 2025
యూఏఈ: యూఏఈలో అనాథ పిల్లలను పోషించడానికి అర్హతను సవరించారు. ఎమిరాటీలు మరియు నివాసితులు ఇద్దరికి వర్తించేలా కొత్త రూల్స్ ను అమల్లోకి తీసుకొచ్చారు. 2025 ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 12 ప్రకారం.. తల్లిదండ్రులు తెలియని పిల్లల సంరక్షణను నియంత్రించే 2022 చట్టంలోని కీలక నిబంధనలను సవరించారు.
సవరించిన ఆర్టికల్ 6 ప్రకారం.. పిల్లలను పెంచడానికి భార్యాభర్తలు యూఏఈలో రెసిడెన్సీ కలిగి ఉండాలి. కనీస వయసు 25 సంవత్సరాలు ఉండాలి. ఎలాంటి నేరారోపణలు ఉండకూడదు. పిల్లలను ప్రభావితం చేసేలా వ్యాధులు లేదా మానసిక సమస్యలు ఉండకూడదు. పిల్లలను పోషించడానికి తగిన ఆర్థిక సామర్థ్యాన్ని చూపించాలి.
ఇక ఒంటరి మహిళల అర్హత పరంగా చూస్తూ.. ఒంటరి మహిళ తప్పనిసరిగా యూఏఈలో నివసిస్తు ఉండాలి. అవివాహితురాలు లేదా విడాకులు తీసుకున్న, వితంతువు అయినా ఫర్వలేదు. కనీస వయసు 30 సంవత్సరాలు ఉండాలి. ఎటువంటి నేరారోపణలు ఉండకూడదు. వైద్యపరంగా ఆరోగ్యంగా ఉండాలి. పిల్లలను పెంచే క్రమంలో నిబంధనలను ఉల్లంఘించిన వారి నుంచి చట్ట ప్రకారం కస్టడీ బాధ్యతలను ఉపసంహరిస్తారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







