పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- November 27, 2025
యూఏఈ: యూఏఈలో అనాథ పిల్లలను పోషించడానికి అర్హతను సవరించారు. ఎమిరాటీలు మరియు నివాసితులు ఇద్దరికి వర్తించేలా కొత్త రూల్స్ ను అమల్లోకి తీసుకొచ్చారు. 2025 ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 12 ప్రకారం.. తల్లిదండ్రులు తెలియని పిల్లల సంరక్షణను నియంత్రించే 2022 చట్టంలోని కీలక నిబంధనలను సవరించారు.
సవరించిన ఆర్టికల్ 6 ప్రకారం.. పిల్లలను పెంచడానికి భార్యాభర్తలు యూఏఈలో రెసిడెన్సీ కలిగి ఉండాలి. కనీస వయసు 25 సంవత్సరాలు ఉండాలి. ఎలాంటి నేరారోపణలు ఉండకూడదు. పిల్లలను ప్రభావితం చేసేలా వ్యాధులు లేదా మానసిక సమస్యలు ఉండకూడదు. పిల్లలను పోషించడానికి తగిన ఆర్థిక సామర్థ్యాన్ని చూపించాలి.
ఇక ఒంటరి మహిళల అర్హత పరంగా చూస్తూ.. ఒంటరి మహిళ తప్పనిసరిగా యూఏఈలో నివసిస్తు ఉండాలి. అవివాహితురాలు లేదా విడాకులు తీసుకున్న, వితంతువు అయినా ఫర్వలేదు. కనీస వయసు 30 సంవత్సరాలు ఉండాలి. ఎటువంటి నేరారోపణలు ఉండకూడదు. వైద్యపరంగా ఆరోగ్యంగా ఉండాలి. పిల్లలను పెంచే క్రమంలో నిబంధనలను ఉల్లంఘించిన వారి నుంచి చట్ట ప్రకారం కస్టడీ బాధ్యతలను ఉపసంహరిస్తారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..









