విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్
- November 27, 2025
విజయవాడ–బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ సేవలు ఈ నెల డిసెంబర్ 10న ప్రారంభం అయ్యే, అవకాశం ఉంది. ప్రారంభ తేదీ పై తుది ధృవీకరణ త్వరలో రానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు ప్రధానంగా విజయవాడ–తిరుపతి–బెంగళూరు మార్గంలో నడుస్తూ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య త్వరితగతి రవాణాకు మార్గం సుగమం చేయనుంది.
ఈ రైలు సేవలను ప్రారంభించడానికి రైల్వే అధికారులు ప్రస్తుతం టైమ్ టేబుల్, సాంకేతిక తనిఖీలను పూర్తిచేస్తున్నారు. ప్రాథమిక ప్రణాళిక ప్రకారం, రైలు ఉదయం 5:15 గంటలకు విజయవాడ నుండి బయలుదేరి మధ్యాహ్నం 1:15 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. అంటే ఇప్పటివరకు 9-10 గంటలు పడుతున్న ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గనుంది.
ప్రత్యేకించి తిరుపతి మీదుగా నడుస్తుండటం ఈ సేవకు మరింత ప్రాధాన్యత తెచ్చిపెడుతోంది. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించడానికి ప్రతి రోజు లక్షలాది మంది యాత్రికులు ప్రయాణిస్తారు.ఈ కొత్త రైలు సేవ వారికీ సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణ ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







