యూఏఈకి క్లీన్ చిట్ ఇచ్చిన టర్కీ..!!
- November 28, 2025
యూఏఈ: ఇస్తాంబుల్లో ఎమిరాటీ గూఢచర్య కార్యకలాపాల ఆరోపణలను టర్కీ తోసిపుచ్చింది. ఈ మేరకు యూఏఈ ప్రకటించింది. యూఏఈ, యూఏఈ వాసులు చట్టవిరుద్ధ కార్యకలాపాలు లేదా అనుమానాస్పద కార్యకలాపాల్లో లేరని టర్కిష్ అటార్నీ జనరల్ ధృవీకరించారని తెలిపింది. ఇస్తాంబుల్లో గూఢచర్య కార్యకలాపాల గురించిన కొన్ని మీడియా నివేదికలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
యూఏఈ గురించి అనుమానాలను రేకెత్తించేలా అవి ఉండటంతో యూఏఈ స్పందించింది. కాగా, అది నిజం కాదని వాటిని తొలగించాలని మీడియా మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను టర్కిష్ అటార్నీ జనరల్ ఆదేశించారు.ఈ విషయంపై యూఏఈ అటార్నీ జనరల్ మరియు టర్కిష్ అటార్నీ జనరల్ టెలిఫోన్ ద్వారా చర్చించారు.మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పౌరులు ఎటువంటి అనుమానాస్పద ప్రవర్తనను గమనించలేదని టర్కీ భద్రతా అధికారులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..









