యూఏఈకి క్లీన్ చిట్ ఇచ్చిన టర్కీ..!!
- November 28, 2025
యూఏఈ: ఇస్తాంబుల్లో ఎమిరాటీ గూఢచర్య కార్యకలాపాల ఆరోపణలను టర్కీ తోసిపుచ్చింది. ఈ మేరకు యూఏఈ ప్రకటించింది. యూఏఈ, యూఏఈ వాసులు చట్టవిరుద్ధ కార్యకలాపాలు లేదా అనుమానాస్పద కార్యకలాపాల్లో లేరని టర్కిష్ అటార్నీ జనరల్ ధృవీకరించారని తెలిపింది. ఇస్తాంబుల్లో గూఢచర్య కార్యకలాపాల గురించిన కొన్ని మీడియా నివేదికలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
యూఏఈ గురించి అనుమానాలను రేకెత్తించేలా అవి ఉండటంతో యూఏఈ స్పందించింది. కాగా, అది నిజం కాదని వాటిని తొలగించాలని మీడియా మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను టర్కిష్ అటార్నీ జనరల్ ఆదేశించారు.ఈ విషయంపై యూఏఈ అటార్నీ జనరల్ మరియు టర్కిష్ అటార్నీ జనరల్ టెలిఫోన్ ద్వారా చర్చించారు.మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పౌరులు ఎటువంటి అనుమానాస్పద ప్రవర్తనను గమనించలేదని టర్కీ భద్రతా అధికారులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







