మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- November 28, 2025
హైదరాబాద్: ప్రపంచ టెక్నాలజీ నాయకుడు సందీప్ కుమార్ మక్తాలా, ఇటీవల రాజభవన మద్దతుతో ప్రకటించిన యూఏఈ గోల్డెన్ వీసా ఘనతను అందుకుని ఈ రోజు హైదరాబాద్ చేరుకున్నారు.ఆయన రాక సందర్భంగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అద్భుతమైన ఫ్లాష్మాబ్తో ఘన స్వాగతం లభించింది.అనంతరం ఆయన భార్య భాగ్యలక్ష్మి తో కలిసి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబును మంత్రివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు.
భారతదేశానికి తిరిగొచ్చిన వెంటనే, మొదటి విజిట్గా మంత్రిని కలవడం ద్వారా, తెలంగాణ ప్రభుత్వంపై తనకు ఉన్న కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేసినట్లు మక్తాలా తెలిపారు.
తెలంగాణ గర్వసుతుడు అయిన సందీప్ మక్తాలా, తెలంగాణ ఉద్యమం సమయంలో సాంకేతిక సేవలు, వాలంటీర్ల సమన్వయం,యువతను చైతన్యపరిచే కార్యక్రమాలు వంటి కీలక భూమిక పోషించిన విషయం తెలిసిందే.రాష్ట్రాభివృద్ధిపై ఆయనకున్న అనుబంధం, బాధ్యత భావం, ఇప్పటికీ ప్రపంచ స్థాయి భాగస్వామ్యాలు,పెట్టుబడులు,ఇన్నోవేషన్ కార్యక్రమాల రూపంలో కొనసాగుతున్నాయి.
మంత్రిని కలిసిన సందర్భంలో, తెలంగాణ గ్లోబల్ కనెక్టివిటీ, పెట్టుబడుల రాక, స్టార్టప్ ఇకోసిస్టమ్ అభివృద్ధి, టెక్నాలజీ–పరిశ్రమల రంగాల పురోగతికి తన సంపూర్ణ సహకారం అందిస్తానని మక్తాలా హామీ ఇచ్చారు. యూఏఈ గౌరవం పొందడం తనకు మరింత బాధ్యతను గుర్తుచేసిందని, ఈ గుర్తింపును తెలంగాణ అభివృద్ధికి ఉపయోగిస్తానని తెలిపారు.
మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ – “సందీప్ మక్తాలా ప్రపంచవ్యాప్త గుర్తింపు తెలంగాణకు గర్వకారణం.రాష్ట్రాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రతిష్ఠాత్మకంగా నిలబెట్టడంలో ఆయన పాత్ర అనివార్యం” అని అభినందించారు. రాష్ట్ర ఆవిష్కరణల దిశగా, పరిశ్రమల వృద్ధిలో, అంతర్జాతీయ భాగస్వామ్యాలు పెంపొందించడంలో మక్తాలా గారి సహకారాన్ని ఆయన స్వాగతించారు.
63 దేశాలలోని 2,843 కంపెనీలకు ప్రతినిధిగా పనిచేస్తున్న డబ్ల్యూటీఐటీసీ చైర్మన్గా, యూఏఈ గౌరవం తనపై పెట్టిన విశ్వాసానికి ప్రతీకగా భావిస్తున్నానని, “తెలంగాణకు గ్లోబల్ బ్రిడ్జెస్ను నిర్మించడం నా బాధ్యత” అని సందీప్ మక్తాలా పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







