గోదావరి పుష్కరాలకు ముహుర్తం ఖరారు!
- November 30, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ గోదావరి పుష్కరాలకు సంబంధించి అధికారిక నివేదికను ప్రభుత్వానికి పంపి, 2027లో పుష్కరాలను జూన్ 26 నుండి జులై 7 వరకు నిర్వహించాలని ముహుర్తం ఖరారు చేసింది. ఈ పుష్కరాలకు 7–8 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని పుష్కరాల నిర్వహణకు రూ.5,704 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు కూడా సిద్ధం అయ్యాయి.
రైల్వే ప్రత్యేక సేవలు
పుష్కరాల ఏర్పాట్లు అన్ని శాఖల సమన్వయంతో చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మంత్రుల కమిటీ, వివిధ శాఖల కార్యదర్శులు, ఆగమ, వైదిక పండితులు పుష్కరాల ఏర్పాట్లపై సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా భక్తుల రద్దీ నియంత్రణ, స్నాన ఘాట్ల నిర్వహణ, రైల్వే ప్రత్యేక సేవలు వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి.
పూర్వపు పుష్కరాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భక్తులు కనీసం రెండు రోజుల పాటు జిల్లాల్లో ఉండేలా, ఇతర ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లేలా సమన్వయం చేపడతామని అధికారులు తెలిపారు. నిడవదోలు, గోదావరి, కొవ్వూరు స్టేషన్లలో రద్దీ తగినంతగా నిర్వహించడానికి వసతులు ఏర్పాటు చేయనున్నట్లు కూడా చెప్పారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









