గోదావరి పుష్కరాలకు ముహుర్తం ఖరారు!
- November 30, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ గోదావరి పుష్కరాలకు సంబంధించి అధికారిక నివేదికను ప్రభుత్వానికి పంపి, 2027లో పుష్కరాలను జూన్ 26 నుండి జులై 7 వరకు నిర్వహించాలని ముహుర్తం ఖరారు చేసింది. ఈ పుష్కరాలకు 7–8 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని పుష్కరాల నిర్వహణకు రూ.5,704 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు కూడా సిద్ధం అయ్యాయి.
రైల్వే ప్రత్యేక సేవలు
పుష్కరాల ఏర్పాట్లు అన్ని శాఖల సమన్వయంతో చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మంత్రుల కమిటీ, వివిధ శాఖల కార్యదర్శులు, ఆగమ, వైదిక పండితులు పుష్కరాల ఏర్పాట్లపై సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా భక్తుల రద్దీ నియంత్రణ, స్నాన ఘాట్ల నిర్వహణ, రైల్వే ప్రత్యేక సేవలు వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి.
పూర్వపు పుష్కరాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భక్తులు కనీసం రెండు రోజుల పాటు జిల్లాల్లో ఉండేలా, ఇతర ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లేలా సమన్వయం చేపడతామని అధికారులు తెలిపారు. నిడవదోలు, గోదావరి, కొవ్వూరు స్టేషన్లలో రద్దీ తగినంతగా నిర్వహించడానికి వసతులు ఏర్పాటు చేయనున్నట్లు కూడా చెప్పారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









