గోదావరి పుష్కరాలకు ముహుర్తం ఖరారు!
- November 30, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ గోదావరి పుష్కరాలకు సంబంధించి అధికారిక నివేదికను ప్రభుత్వానికి పంపి, 2027లో పుష్కరాలను జూన్ 26 నుండి జులై 7 వరకు నిర్వహించాలని ముహుర్తం ఖరారు చేసింది. ఈ పుష్కరాలకు 7–8 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని పుష్కరాల నిర్వహణకు రూ.5,704 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు కూడా సిద్ధం అయ్యాయి.
రైల్వే ప్రత్యేక సేవలు
పుష్కరాల ఏర్పాట్లు అన్ని శాఖల సమన్వయంతో చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మంత్రుల కమిటీ, వివిధ శాఖల కార్యదర్శులు, ఆగమ, వైదిక పండితులు పుష్కరాల ఏర్పాట్లపై సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా భక్తుల రద్దీ నియంత్రణ, స్నాన ఘాట్ల నిర్వహణ, రైల్వే ప్రత్యేక సేవలు వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి.
పూర్వపు పుష్కరాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భక్తులు కనీసం రెండు రోజుల పాటు జిల్లాల్లో ఉండేలా, ఇతర ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లేలా సమన్వయం చేపడతామని అధికారులు తెలిపారు. నిడవదోలు, గోదావరి, కొవ్వూరు స్టేషన్లలో రద్దీ తగినంతగా నిర్వహించడానికి వసతులు ఏర్పాటు చేయనున్నట్లు కూడా చెప్పారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







