తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం..
- November 30, 2025
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు అనునిత్యం ప్రయత్నాలు చేస్తున్న టీజీఎస్ఆర్టీసీ..మరో ఆలోచనతో ప్రయాణికుల ముందుకొచ్చింది. ఇకపై బస్సు ప్రయాణానికి 60రోజుల ముందుగానే టికెట్లను రిజర్వేషన్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
60 రోజుల ముందస్తు బుకింగ్ సదుపాయం గతంలోనూ అందుబాటులో ఉంది.అయితే, దీనిపై చాలా మందికి అవగాహన లేకపోవడంతో పండుగల సీజన్ నేపథ్యంలో దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ముఖ్యంగా పండుగలు, సెలవుల సీజన్ను దృష్టిలో ఉంచుకొని, ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందుగానే తమ ప్రయాణ ప్రణాళికలు వేసుకునేందుకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు, తద్వారా వారికి మరింత చేరువయ్యేందుకు టీజీఎస్ఆర్టీసీ అనేక ప్రయత్నాలు చేస్తోంది.ఈ క్రమంలో ప్రయాణికులను ఆకర్షించేలా సరికొత్త స్కీంలను సైతం అందుబాటులోకి తీసుకొస్తుంది.ఇందులో భాగంగా దసరా, దీపావళి పండుగల సమయంలో లక్కీడ్రాను సైతం నిర్వహించింది. అంతేకాక..ప్రయాణికుల కోసం ‘గమ్యం’ యాప్ ద్వారా బస్సుల లైవ్ లొకేషన్ తెలుసుకునే సదుపాయం కల్పించింది. పలు ప్రాంతాలకు ఏసీ, సీటర్, స్లీపర్ సర్వీసులను టీజీఎస్ ఆర్టీసీ తీసుకొచ్చింది. విమాన ప్రయాణం మాదిరే బస్సు సర్వీసు, ప్రయాణ సమయం, స్టాపుల వివరాలను బస్సు ప్రయాణం ప్రారంభానికి ముందే వివరిస్తారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









