తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం..
- November 30, 2025
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు అనునిత్యం ప్రయత్నాలు చేస్తున్న టీజీఎస్ఆర్టీసీ..మరో ఆలోచనతో ప్రయాణికుల ముందుకొచ్చింది. ఇకపై బస్సు ప్రయాణానికి 60రోజుల ముందుగానే టికెట్లను రిజర్వేషన్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
60 రోజుల ముందస్తు బుకింగ్ సదుపాయం గతంలోనూ అందుబాటులో ఉంది.అయితే, దీనిపై చాలా మందికి అవగాహన లేకపోవడంతో పండుగల సీజన్ నేపథ్యంలో దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ముఖ్యంగా పండుగలు, సెలవుల సీజన్ను దృష్టిలో ఉంచుకొని, ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందుగానే తమ ప్రయాణ ప్రణాళికలు వేసుకునేందుకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు, తద్వారా వారికి మరింత చేరువయ్యేందుకు టీజీఎస్ఆర్టీసీ అనేక ప్రయత్నాలు చేస్తోంది.ఈ క్రమంలో ప్రయాణికులను ఆకర్షించేలా సరికొత్త స్కీంలను సైతం అందుబాటులోకి తీసుకొస్తుంది.ఇందులో భాగంగా దసరా, దీపావళి పండుగల సమయంలో లక్కీడ్రాను సైతం నిర్వహించింది. అంతేకాక..ప్రయాణికుల కోసం ‘గమ్యం’ యాప్ ద్వారా బస్సుల లైవ్ లొకేషన్ తెలుసుకునే సదుపాయం కల్పించింది. పలు ప్రాంతాలకు ఏసీ, సీటర్, స్లీపర్ సర్వీసులను టీజీఎస్ ఆర్టీసీ తీసుకొచ్చింది. విమాన ప్రయాణం మాదిరే బస్సు సర్వీసు, ప్రయాణ సమయం, స్టాపుల వివరాలను బస్సు ప్రయాణం ప్రారంభానికి ముందే వివరిస్తారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







