తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం..
- November 30, 2025
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు అనునిత్యం ప్రయత్నాలు చేస్తున్న టీజీఎస్ఆర్టీసీ..మరో ఆలోచనతో ప్రయాణికుల ముందుకొచ్చింది. ఇకపై బస్సు ప్రయాణానికి 60రోజుల ముందుగానే టికెట్లను రిజర్వేషన్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
60 రోజుల ముందస్తు బుకింగ్ సదుపాయం గతంలోనూ అందుబాటులో ఉంది.అయితే, దీనిపై చాలా మందికి అవగాహన లేకపోవడంతో పండుగల సీజన్ నేపథ్యంలో దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ముఖ్యంగా పండుగలు, సెలవుల సీజన్ను దృష్టిలో ఉంచుకొని, ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందుగానే తమ ప్రయాణ ప్రణాళికలు వేసుకునేందుకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు, తద్వారా వారికి మరింత చేరువయ్యేందుకు టీజీఎస్ఆర్టీసీ అనేక ప్రయత్నాలు చేస్తోంది.ఈ క్రమంలో ప్రయాణికులను ఆకర్షించేలా సరికొత్త స్కీంలను సైతం అందుబాటులోకి తీసుకొస్తుంది.ఇందులో భాగంగా దసరా, దీపావళి పండుగల సమయంలో లక్కీడ్రాను సైతం నిర్వహించింది. అంతేకాక..ప్రయాణికుల కోసం ‘గమ్యం’ యాప్ ద్వారా బస్సుల లైవ్ లొకేషన్ తెలుసుకునే సదుపాయం కల్పించింది. పలు ప్రాంతాలకు ఏసీ, సీటర్, స్లీపర్ సర్వీసులను టీజీఎస్ ఆర్టీసీ తీసుకొచ్చింది. విమాన ప్రయాణం మాదిరే బస్సు సర్వీసు, ప్రయాణ సమయం, స్టాపుల వివరాలను బస్సు ప్రయాణం ప్రారంభానికి ముందే వివరిస్తారు.
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్లో కేర్ గివర్స్కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







