తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం..
- November 30, 2025
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు అనునిత్యం ప్రయత్నాలు చేస్తున్న టీజీఎస్ఆర్టీసీ..మరో ఆలోచనతో ప్రయాణికుల ముందుకొచ్చింది. ఇకపై బస్సు ప్రయాణానికి 60రోజుల ముందుగానే టికెట్లను రిజర్వేషన్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
60 రోజుల ముందస్తు బుకింగ్ సదుపాయం గతంలోనూ అందుబాటులో ఉంది.అయితే, దీనిపై చాలా మందికి అవగాహన లేకపోవడంతో పండుగల సీజన్ నేపథ్యంలో దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ముఖ్యంగా పండుగలు, సెలవుల సీజన్ను దృష్టిలో ఉంచుకొని, ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందుగానే తమ ప్రయాణ ప్రణాళికలు వేసుకునేందుకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు, తద్వారా వారికి మరింత చేరువయ్యేందుకు టీజీఎస్ఆర్టీసీ అనేక ప్రయత్నాలు చేస్తోంది.ఈ క్రమంలో ప్రయాణికులను ఆకర్షించేలా సరికొత్త స్కీంలను సైతం అందుబాటులోకి తీసుకొస్తుంది.ఇందులో భాగంగా దసరా, దీపావళి పండుగల సమయంలో లక్కీడ్రాను సైతం నిర్వహించింది. అంతేకాక..ప్రయాణికుల కోసం ‘గమ్యం’ యాప్ ద్వారా బస్సుల లైవ్ లొకేషన్ తెలుసుకునే సదుపాయం కల్పించింది. పలు ప్రాంతాలకు ఏసీ, సీటర్, స్లీపర్ సర్వీసులను టీజీఎస్ ఆర్టీసీ తీసుకొచ్చింది. విమాన ప్రయాణం మాదిరే బస్సు సర్వీసు, ప్రయాణ సమయం, స్టాపుల వివరాలను బస్సు ప్రయాణం ప్రారంభానికి ముందే వివరిస్తారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









