తెలంగాణలో మరో రైల్వేలైన్కు గ్రీన్సిగ్నల్..
- November 30, 2025
హైదరాబాద్: తెలంగాణలో 10 ఏళ్ల తరువాత నూతన రైల్వే లైన్కు గ్రీన్సిగ్నల్ అందింది. దాదాపు పదేళ్లుగా పెండింగ్లో ఉన్న రామగుండం–మణుగూరు రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర రైల్వే శాఖ నుండి సూత్రప్రాయ ఆమోదం లభించింది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ నిరంతర ప్రయత్నాల ఫలితంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు కదిలింది. సుమారు 4,000 కోట్ల రూపాయల వ్యయంతో రైల్వే మార్గం నిర్మించనున్నారు.
ఈ కొత్త రైల్వే లైన్...
- సింగరేణి కార్మికులు, భక్తులు, స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందిస్తుంది.
- బొగ్గు రవాణాను వేగవంతం చేసి, విద్యుత్ కేంద్రాలు, పరిశ్రమలకు లాభం కల్పిస్తుంది.
- సమ్మక్క-సారక్క జాతరకు వెళ్ళే వేలాది భక్తులకు ప్రత్యేక కనెక్టివిటీ ఇస్తుంది.
- రైల్వే మార్గం రోడ్లు, జాతీయ రహదారి NH-63, ప్రాంతీయ రవాణా వ్యవస్థలతో సమన్వయం అవుతుంది.
ఎంపీ వంశీకృష్ణ తెలిపారు, ఈ ప్రాజెక్ట్ పెద్దపల్లి మరియు మంచిర్యాల ప్రాంతాల మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ పారిశ్రామిక, సామాజిక అభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. స్థానిక ప్రజలు, కార్మికులు, భక్తుల ప్రయాణ సౌకర్యం, వ్యయ మరియు సమయాన్ని తగ్గించడానికి ఇది చారిత్రక ప్రాజెక్ట్గా నిలుస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









