తెలంగాణలో మరో రైల్వేలైన్కు గ్రీన్సిగ్నల్..
- November 30, 2025
హైదరాబాద్: తెలంగాణలో 10 ఏళ్ల తరువాత నూతన రైల్వే లైన్కు గ్రీన్సిగ్నల్ అందింది. దాదాపు పదేళ్లుగా పెండింగ్లో ఉన్న రామగుండం–మణుగూరు రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర రైల్వే శాఖ నుండి సూత్రప్రాయ ఆమోదం లభించింది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ నిరంతర ప్రయత్నాల ఫలితంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు కదిలింది. సుమారు 4,000 కోట్ల రూపాయల వ్యయంతో రైల్వే మార్గం నిర్మించనున్నారు.
ఈ కొత్త రైల్వే లైన్...
- సింగరేణి కార్మికులు, భక్తులు, స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందిస్తుంది.
- బొగ్గు రవాణాను వేగవంతం చేసి, విద్యుత్ కేంద్రాలు, పరిశ్రమలకు లాభం కల్పిస్తుంది.
- సమ్మక్క-సారక్క జాతరకు వెళ్ళే వేలాది భక్తులకు ప్రత్యేక కనెక్టివిటీ ఇస్తుంది.
- రైల్వే మార్గం రోడ్లు, జాతీయ రహదారి NH-63, ప్రాంతీయ రవాణా వ్యవస్థలతో సమన్వయం అవుతుంది.
ఎంపీ వంశీకృష్ణ తెలిపారు, ఈ ప్రాజెక్ట్ పెద్దపల్లి మరియు మంచిర్యాల ప్రాంతాల మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ పారిశ్రామిక, సామాజిక అభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. స్థానిక ప్రజలు, కార్మికులు, భక్తుల ప్రయాణ సౌకర్యం, వ్యయ మరియు సమయాన్ని తగ్గించడానికి ఇది చారిత్రక ప్రాజెక్ట్గా నిలుస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?









