తెలుగు రాష్ట్రాల్లో కొత్త టెన్షన్
- December 02, 2025
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోనసీమ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ వేడి పెంచాయి. కేశనపల్లి ప్రాంతంలో కొబ్బరి తోటల నష్టం చూసి స్పందించిన పవన్— “కోనసీమకు దిష్టి తగిలింది…రాష్ట్ర విభజనకు గోదావరి జిల్లాల పచ్చదనం కూడా ఒక కారకం” అంటూ చేసిన వ్యాఖ్యలు భారీ చర్చకు దారితీశాయి.ఈ వ్యాఖ్యలను పలువురు నేతలు సున్నితమైన భావాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చిన క్షణాల్లోనే BRS నేతలు, ఆపై వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా కౌంటర్లు ఇవ్వడం ప్రారంభించారు. తెలంగాణ–ఆంధ్ర మధ్య అప్పుడప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ మాట్లాడే అంశాల్లో ఇది ఉండటంతో వివాదం మరింతగా రగిలింది.
పవన్ మాటలకు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గట్టిగా స్పందించారు.తెలంగాణ ఉద్యమానికి కోనసీమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ— “నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగిన ఉద్యమం పై అవగాహన లేకుండా పవన్ మాట్లాడారు” అని అన్నారు. అంతటితో ఆగకుండా, “బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే పవన్ కల్యాణ్ సినిమాలు తెలంగాణలో విడుదల కావు” అని కఠిన హెచ్చరిక కూడా చేశారు. పాత ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఆదాయంతో ఆంధ్ర ఏరియాలు అభివృద్ధి చెందాయని, వరంగల్–నిజామాబాద్ వంటి జిల్లాలు అభివృద్ధి అవకాశాలు కోల్పోయాయని గుర్తు చేశారు. తెలుగురాష్ట్రాల మధ్య పాత గాయాలు మళ్లీ తెరపైకి రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
పవన్ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సున్నిత భావోద్వేగాలను తాకినట్టుగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. విభజన(Bifurcation Fallout) అంశం కొంతకాలంగా ఉపశమనం చెందిందనుకున్న సమయంలో ఈ తరహా వ్యాఖ్యలు తిరిగి వివాదాలకు దారితీయడం సహజమని వారు చెబుతున్నారు. రాజకీయ నాయకులు ప్రజల భావాలను దెబ్బతీయకుండా మాట్లాడే బాధ్యత ఉందని గుర్తు చేస్తున్నారు. పవన్పై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆయన స్పందిస్తారా? క్షమాపణ చెబుతారా? లేక తన వ్యాఖ్యలపై స్పష్టతనిస్తారా? అన్నది ఇప్పుడు ఎదురుచూపుల అంశంగా మారింది.
తాజా వార్తలు
- హైదరాబాద్: పారిశ్రామిక భూముల బదలాయింపును అడ్డుకునేందుకు కేటీఆర్ పర్యటన
- మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ
- కామినేని విజయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయి
- రూపాయి కుప్పకూలింది..
- దక్షిణ సుర్రాలో సందర్శకులకు పార్కింగ్ ఏర్పాట్లు..!!
- ధోఫర్లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- సరికొత్త కారును గెలుచుకున్న ప్రవాస కార్పెంటర్..!!
- బహ్రెయిన్లో ఆసియా మహిళ పై విచారణ ప్రారంభం..!!
- ప్రైవేట్ రంగంలో.5 మిలియన్ల సౌదీలు..!!
- ఖతార్ లో 2025 చివరి సూపర్మూన్..!!







