మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- March 10, 2026
మనామా: బహ్రెయిన్ రాజధాని మనామాలోని ఒక నివాస భవనాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఇరాన్ దాడిలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరికొందరు గాయపడినట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం, ఈ దాడి ఒక నివాస భవనాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన స్పష్టమైన శత్రు చర్యగా పేర్కొంది. దాడి కారణంగా భవనానికి గణనీయమైన నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.
గాయపడిన వారిని తక్షణమే సమీప ఆసుపత్రులకు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారని అధికారులు వెల్లడించారు. వారి ఆరోగ్య పరిస్థితి పై వైద్య బృందాలు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఘటన పై భద్రతా మరియు అత్యవసర సేవల బృందాలు వెంటనే స్పందించి సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టినట్లు కూడా అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









