రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- March 10, 2026
యూఏఈ: యూఏఈలో నివాసితుల ఫోన్లకు వచ్చే అత్యవసర హెచ్చరికల (ఎమర్జెన్సీ అలర్ట్స్) సౌండ్ లో రాత్రి సమయంలో మార్పులు చేయనున్నట్లు నేషనల్ ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) ప్రకటించింది.
ప్రస్తుతం ఉపయోగిస్తున్న గట్టిగా వినిపించే అలారం సౌండ్ పగటి సమయంలో యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది. అయితే రాత్రి 10:30 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు పంపించే ఎమర్జెన్సీ అలర్ట్లకు సాధారణంగా టెక్స్ట్ మెసేజ్లకు వినిపించే శబ్దాన్ని ఉపయోగించనున్నట్లు వెల్లడించింది.
ఈ మార్పు వల్ల రాత్రి సమయంలో ప్రజలకు అనవసరమైన భయాందోళనలు లేదా నిద్రలో అంతరాయం కలగకుండా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు NCEMA తెలిపింది. అదే సమయంలో అత్యవసర సమాచారం మాత్రం యథావిధిగా ప్రజలకు చేరుతుందని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!







