రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- March 10, 2026
యూఏఈ: యూఏఈలో నివాసితుల ఫోన్లకు వచ్చే అత్యవసర హెచ్చరికల (ఎమర్జెన్సీ అలర్ట్స్) సౌండ్ లో రాత్రి సమయంలో మార్పులు చేయనున్నట్లు నేషనల్ ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) ప్రకటించింది.
ప్రస్తుతం ఉపయోగిస్తున్న గట్టిగా వినిపించే అలారం సౌండ్ పగటి సమయంలో యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది. అయితే రాత్రి 10:30 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు పంపించే ఎమర్జెన్సీ అలర్ట్లకు సాధారణంగా టెక్స్ట్ మెసేజ్లకు వినిపించే శబ్దాన్ని ఉపయోగించనున్నట్లు వెల్లడించింది.
ఈ మార్పు వల్ల రాత్రి సమయంలో ప్రజలకు అనవసరమైన భయాందోళనలు లేదా నిద్రలో అంతరాయం కలగకుండా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు NCEMA తెలిపింది. అదే సమయంలో అత్యవసర సమాచారం మాత్రం యథావిధిగా ప్రజలకు చేరుతుందని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!









