రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- March 10, 2026
యూఏఈ: యూఏఈలో నివాసితుల ఫోన్లకు వచ్చే అత్యవసర హెచ్చరికల (ఎమర్జెన్సీ అలర్ట్స్) సౌండ్ లో రాత్రి సమయంలో మార్పులు చేయనున్నట్లు నేషనల్ ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) ప్రకటించింది.
ప్రస్తుతం ఉపయోగిస్తున్న గట్టిగా వినిపించే అలారం సౌండ్ పగటి సమయంలో యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది. అయితే రాత్రి 10:30 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు పంపించే ఎమర్జెన్సీ అలర్ట్లకు సాధారణంగా టెక్స్ట్ మెసేజ్లకు వినిపించే శబ్దాన్ని ఉపయోగించనున్నట్లు వెల్లడించింది.
ఈ మార్పు వల్ల రాత్రి సమయంలో ప్రజలకు అనవసరమైన భయాందోళనలు లేదా నిద్రలో అంతరాయం కలగకుండా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు NCEMA తెలిపింది. అదే సమయంలో అత్యవసర సమాచారం మాత్రం యథావిధిగా ప్రజలకు చేరుతుందని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









