రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- March 10, 2026
యూఏఈ: యూఏఈలో నివాసితుల ఫోన్లకు వచ్చే అత్యవసర హెచ్చరికల (ఎమర్జెన్సీ అలర్ట్స్) సౌండ్ లో రాత్రి సమయంలో మార్పులు చేయనున్నట్లు నేషనల్ ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) ప్రకటించింది.
ప్రస్తుతం ఉపయోగిస్తున్న గట్టిగా వినిపించే అలారం సౌండ్ పగటి సమయంలో యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది. అయితే రాత్రి 10:30 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు పంపించే ఎమర్జెన్సీ అలర్ట్లకు సాధారణంగా టెక్స్ట్ మెసేజ్లకు వినిపించే శబ్దాన్ని ఉపయోగించనున్నట్లు వెల్లడించింది.
ఈ మార్పు వల్ల రాత్రి సమయంలో ప్రజలకు అనవసరమైన భయాందోళనలు లేదా నిద్రలో అంతరాయం కలగకుండా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు NCEMA తెలిపింది. అదే సమయంలో అత్యవసర సమాచారం మాత్రం యథావిధిగా ప్రజలకు చేరుతుందని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









