టీ20 ప్రపంచకప్కి టీమిండియా జెర్సీ విడుదల
- December 03, 2025
రాయ్పూర్: రాబోయే సంవత్సరం జరగనున్న టీ20 ప్రపంచకప్, సందర్భంగా బీసీసీఐ బుధవారం కొత్త జెర్సీని విడుదల చేసింది.దక్షిణాఫ్రికా-భారత్ మధ్య రాయ్పూర్ వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్, ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రచారకర్త రోహిత్ శర్మ టీమిండియా కొత్త జెర్సీని ఆవిష్కరించారు.
టీమిండియా రైజింగ్ స్టార్ తిలక్ వర్మ, బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా, సంయుక్త కార్యదర్శి ప్రభతేజ్ సింగ్ భాటియా, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పాల్గొన్నారు.రాయ్పూర్కు చెందిన దాదాపు వంద మందికిపైగా విద్యార్థులను ఆహ్వానించారు. ఐసీసీ మెగా ఈవెంట్ కోసం సిద్ధం చేసిన భారత జెర్సీ లైఫ్ సైజ్ మోడల్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. భారత జట్టుకు ఎల్లప్పుడు నా శుభాకాంక్షలు ఉంటాయి.ప్రతి ఒక్కరూ భారత జట్టుకు మద్దతు ఇస్తారు.జట్టు కప్ను గెలిచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తుందని అనుకుంటున్నాను’ రోహిత్ చెప్పాడు. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న టీ20 ప్రపంచకప్ 2026 పూర్తి షెడ్యూల్ను ఐసీసీ గత నెలలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 7న టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!









