లేబర్ ఫోర్సులో కువైటీలు 11శాతం..!!

- December 06, 2025 , by Maagulf
లేబర్ ఫోర్సులో కువైటీలు 11శాతం..!!

కువైట్: కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ ఇండస్ట్రీ (PAI) తన 2024 ఇండస్ట్రియల్ సర్వే నివేదిక ఫలితాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా సుమారు 109,000 మంది కార్మికులను నియమించినప్పటికీ, కువైట్ కార్మికులు పారిశ్రామిక రంగంలోని శ్రామిక శక్తిలో 11% మాత్రమే ఉన్నారని వెల్లడించింది. ఈ నివేదిక బలమైన జాతీయ శ్రామిక శక్తి అభివృద్ధి వ్యూహాల అవసరాన్ని హైలైట్ చేస్తుందని  PAI యాక్టింగ్ డైరెక్టర్ జనరల్, షామ్లాన్ అల్-జహ్దాలి తెలిపారు. అథారిటీ లైసెన్స్ పొందిన 741 పారిశ్రామిక సంస్థలను పరిశీలించివేసిట్లు వెల్లడించారు. 

పారిశ్రామిక విధానాన్ని రూపొందించడంలో, పెట్టుబడులను ఆకర్షించడంలో ఈ అధ్యయనం ఒక ముఖ్యమైన సాధనంగా మిగిలిందని అల్-జహ్దాలి నొక్కిచెప్పారు. 2023లో మొత్తం పారిశ్రామిక ఉత్పత్తులు విలువ KD 5.07 బిలియన్లకు చేరుకుందని వెల్లడించారు.   

2023లో పారిశ్రామిక రంగం మొత్తం కార్మికుల పరిహారంలో 784.5 మిలియన్ కువైట్ దినార్లు చెల్లించిందని సర్వే వెల్లడించింది.అయితే, మొత్తం శ్రామిక శక్తిలో కేవలం 11% మాత్రమే ఉన్న కువైట్ పౌరుల పరిమిత భాగస్వామ్యం ఒక ప్రధాన సవాలుగా మారిందని, ఈ రంగంలో జాతీయ కార్మిక భాగస్వామ్యాన్ని పెంచడానికి శిక్షణ, నైపుణ్య అభివృద్ధి, ఉపాధి కార్యక్రమాలు అవసరమని తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com