బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- December 07, 2025
మనమా: బహ్రెయిన్ లో శిక్షాస్మృతికి సవరణలలో భాగంగా జైళ్ల పేరును 'సంస్కరణ మరియు పునరావాస కేంద్రాలు'గా మార్చాలని ప్రతిపాదించారు. ఈ మేరకు క్యాబినెట్ ప్రతినిధుల సభకు ఒక ముసాయిదా చట్టాన్ని పంపించారు.అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) గైడ్ లైన్స్ ప్రకారం..బహ్రెయిన్ చట్టాలలో సంస్కరణలను అమలు చేయనున్నారు.
2025 నాటి డిక్రీ నంబర్ (68) ముసాయిదా చట్టం, శిక్షాస్మృతిలో 'జైలు' స్థానంలో 'సంస్కరణ మరియు పునరావాస కేంద్రం' అని పేర్కొన్నారు. ప్రతిపాదిత సవరణల ప్రకారం, కస్టోడియల్ శిక్షలు అనుభవిస్తున్న వారు ఈ కేంద్రాలలో పునరావాసం మరియు శిక్షణా కార్యక్రమాలలో పాల్గొనవలసి ఉంటుంది. బహ్రెయిన్ 1998లో ఫోర్స్డ్ లేబర్ కన్వెన్షన్కు అంగీకరించింది. ఇప్పుడు ప్రిజన్ చట్టాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా సంస్కరణలు చేస్తున్నట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







