బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- December 07, 2025
మనమా: బహ్రెయిన్ లో శిక్షాస్మృతికి సవరణలలో భాగంగా జైళ్ల పేరును 'సంస్కరణ మరియు పునరావాస కేంద్రాలు'గా మార్చాలని ప్రతిపాదించారు. ఈ మేరకు క్యాబినెట్ ప్రతినిధుల సభకు ఒక ముసాయిదా చట్టాన్ని పంపించారు.అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) గైడ్ లైన్స్ ప్రకారం..బహ్రెయిన్ చట్టాలలో సంస్కరణలను అమలు చేయనున్నారు.
2025 నాటి డిక్రీ నంబర్ (68) ముసాయిదా చట్టం, శిక్షాస్మృతిలో 'జైలు' స్థానంలో 'సంస్కరణ మరియు పునరావాస కేంద్రం' అని పేర్కొన్నారు. ప్రతిపాదిత సవరణల ప్రకారం, కస్టోడియల్ శిక్షలు అనుభవిస్తున్న వారు ఈ కేంద్రాలలో పునరావాసం మరియు శిక్షణా కార్యక్రమాలలో పాల్గొనవలసి ఉంటుంది. బహ్రెయిన్ 1998లో ఫోర్స్డ్ లేబర్ కన్వెన్షన్కు అంగీకరించింది. ఇప్పుడు ప్రిజన్ చట్టాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా సంస్కరణలు చేస్తున్నట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







