బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- December 07, 2025
మనమా: బహ్రెయిన్ లో శిక్షాస్మృతికి సవరణలలో భాగంగా జైళ్ల పేరును 'సంస్కరణ మరియు పునరావాస కేంద్రాలు'గా మార్చాలని ప్రతిపాదించారు. ఈ మేరకు క్యాబినెట్ ప్రతినిధుల సభకు ఒక ముసాయిదా చట్టాన్ని పంపించారు.అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) గైడ్ లైన్స్ ప్రకారం..బహ్రెయిన్ చట్టాలలో సంస్కరణలను అమలు చేయనున్నారు.
2025 నాటి డిక్రీ నంబర్ (68) ముసాయిదా చట్టం, శిక్షాస్మృతిలో 'జైలు' స్థానంలో 'సంస్కరణ మరియు పునరావాస కేంద్రం' అని పేర్కొన్నారు. ప్రతిపాదిత సవరణల ప్రకారం, కస్టోడియల్ శిక్షలు అనుభవిస్తున్న వారు ఈ కేంద్రాలలో పునరావాసం మరియు శిక్షణా కార్యక్రమాలలో పాల్గొనవలసి ఉంటుంది. బహ్రెయిన్ 1998లో ఫోర్స్డ్ లేబర్ కన్వెన్షన్కు అంగీకరించింది. ఇప్పుడు ప్రిజన్ చట్టాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా సంస్కరణలు చేస్తున్నట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చ
- దుబాయ్లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!
- ఫోర్బ్స్ టాప్ 100లో ఆరు కువైట్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కు చోటు..!!







